లాక్డౌన్లో శ్రీవారి టికెట్లు బుక్ చేసి రద్దు చేసుకున్న భక్తులకు తితిదే... డబ్బులను రీఫండ్ చేస్తోంది. మార్చి 13 నుంచి జూన్ 30 వరకు ఆన్లైన్, పోస్టాఫీసు, ఈ- దర్శన్, ఏపీ ఆన్లైన్ కౌంటర్ల ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదులను బుక్ చేసుకున్న భక్తులు వాటిని రద్దు చేసుకుంటే ఆ మొత్తాన్నితితిదే తిరిగి అందిస్తోంది. వాటి గడువును డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు తితిదే ప్రకటించింది.
పోస్టాఫీసు, ఈ- దర్శన్ కౌంటర్లు, ఏపీ ఆన్ లైన్ కౌంటర్ల ద్వారా బుక్ చేసుకున్న భక్తులు సంబంధిత టికెట్ వివరాలతో పాటు, బ్యాంకు ఖాతా నంబరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని తితిదే ప్రకటించింది. మెయిల్ వివరాలను పరిశీలించిన అనంతరం మొత్తాన్ని నేరుగా భక్తుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటలో తెలిపింది.