తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2019, 8:00 AM IST

ETV Bharat / city

ఓయూ జేఏసీ విద్యార్థులతో భేటీ కానున్న ఆర్టీసీ ఐకాస

ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ట్యాంక్​ బండ్​పై దీక్షకు ఇవాళ వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల మద్దతు కూడగట్టనుంది. ఆర్టీసీ ఎంప్లాయిస్​ యూనియన్​ కార్యాలయంలో ఓయూ జేఏసీ నేతలతో సమావేశం కానున్నారు.

ఓయూ జేఏసీ విద్యార్థులతో భేటి కానున్న ఆర్టీసీ ఐకాస

ఆర్టీసీ కార్మికుల నిరసనల్లో భాగంగా ఈనెల 9న టాంక్​బండ్​పై నిరనసలు చేయాలని నిర్ణయించింది ఆర్టీసీ ఐకాస. అందులో భాగంగా ఇవాళ విద్యానగర్​లోని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. ట్యాంక్ బండ్​పై నిర్వహించనున్న దీక్షలో పాల్గొనాల్సిందిగా ఓయూ విద్యార్థులకు ఆర్టీసీ జేఏసీ విజ్ఞప్తి చేయనుంది. అదేవిధంగా రేపటి దీక్షకు సంబంధించి సన్నాహక కార్యక్రమాలపై ఆర్టీసీ నేతలు సమాలోచనలు చేయనున్నారు. విపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లతో కూడా సమాలోచనలు చేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details