తెలంగాణ

telangana

By

Published : May 4, 2020, 7:59 PM IST

ETV Bharat / city

'మంత్రివర్గ నిర్ణయాలకు ప్రజలు సహకరించాలి'

ముఖ్యమంత్రి కేసీఆర్​ ముందు జాగ్రత్తల వల్లనే రాష్ట్రంలో కరోనాను నియంత్రించగలిగామని టీఎస్​ఐఐసీ ఛైర్మన్​ గ్యాదరి బాలమల్లు అన్నారు. బషీర్​బాగ్​ పరిశ్రమల భవన్​లో సిబ్బందికి నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

tsiic chairmen gyadari balamallu distribute groceries to parishramala bhavan employes
'మంత్రివర్గ నిర్ణయాలకు ప్రజలు సహకరించాలి'

ముఖ్యమంత్రి కేసీఆర్​ అధ్యక్షతన మంగళవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు రాష్ట్ర ప్రజలు సహకరించాలని రాష్ట్ర పరిశ్రమల, ఉపాధి కల్పన సంస్థ ఛైర్మన్​ గ్యాదరి బాలమల్లు కోరారు. బషీర్​బాగ్​ పరిశ్రమల భన్​లో ఔట్​సోర్సింగ్​, అటెండర్లు, డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందజేశారు. సీఎం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే రాష్ట్రంలో కరోనా వైరస్​ నియంత్రించగలిగినట్టు తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్​ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details