తెలంగాణ

telangana

ఆర్టీసీ సమ్మెపై 5 గంటలకు కీలక ప్రకటన?

ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు ఎంజీబీఎస్‌లో అత్యవసరంగా సమావేశమయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతి, భవిష్యత్ కార్యాచరణపై నేతలు సమాలోచనలు చేశారు. సాయంత్రం 5 గంటలకు మరోసారి సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మె కొనసాగింపు అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

By

Published : Nov 20, 2019, 2:41 PM IST

Published : Nov 20, 2019, 2:41 PM IST

Updated : Nov 20, 2019, 4:23 PM IST

ts rtc jac leaders meeting in hyd

ఆర్టీసీ ఐకాస నేతలు ఎంజీబీఎస్​లో అత్యవసరంగా భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు ప్రతిపై సుదీర్ఘంగా చర్చించారు. సమ్మె తదనంతర అంశాలపై సమాలోచనలు చేశారు. అనంతరం ఎంజీబీఎస్ నుంచి హైకోర్టుకు బయలుదేరి వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో మరోసారి ఆర్టీసీ ఐకాస నేతలు సమావేశమై సమ్మెపై కీలక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.

Last Updated : Nov 20, 2019, 4:23 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details