ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్థులు ఈనెల 6 నుంచి 12 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. ఈనెల 8 నుంచి 13 వరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు.
ఈనెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం - ఐసెట్ కౌన్సెలింగ్ తేదీలు
ఈ నెల 6 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 6 నుంచి 12 వరకు ఆన్లైన్లో ప్రాసెసింగ్ రుసుము చెల్లించి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. 15న మొదటి విడత, 22న చివరి విడత కౌన్సెలింగ్ జరగనున్నట్లు ప్రకటించారు.
15న మొదటి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లను కేటాయించనున్నారు. సీటు పొందిన అభ్యర్థులు 15 నుంచి 19 వరకు ఆన్లైన్లో బోధన రుసుము చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 22న చివరి విడత కౌన్సెలింగ్ పక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడత ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్థులు.. 22న ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకొని.. 23న ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుంది. 22 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.
ఈ నెల 26న చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయిస్తారు. 26 నుంచి 29 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ ప్రైవేట్ కాలేజీల్లో తక్షణ ప్రవేశాల కోసం 28న మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు నవీన్ మిత్తల్ తెలిపారు.