తెలంగాణ

telangana

By

Published : Feb 16, 2021, 6:56 PM IST

ETV Bharat / city

రేపు అందరూ మొక్కలు నాటాలి: మహమూద్​ అలీ

బుధవారం కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా అందరూ మొక్కలు నాటాలని హోంమంత్రి మహమూద్​ అలీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ భవన్​లో కేసీఆర్ సేవా మండలి ఏర్పాటుచేసిన దివ్యాంగులకు చక్రాల కుర్చీల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.

mahmood ali on kcr
mahmood ali on kcr

ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు దేవుడిచ్చిన వరమని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని.. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు కృషిచేస్తున్నారని కితాబిచ్చారు.

రేపు ముఖ్యమంత్రి కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భవన్​లో కేసీఆర్ సేవా మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యాంగులకు చక్రాల కుర్చీలు పంపిణీ కార్యక్రమంలో మహమూద్​ అలీ పాల్గొని కేక్​ కట్​ చేశారు. రేపు..అందరూ మొక్కలు నాటాలని హోంమంత్రి కోరారు.

కేక్​ కట్​ చేస్తున్న హోంమంత్రి మహమూద్​ అలీ
కేసీఆర్ సేవామండలి ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న హోంశాఖ మంత్రి మహమూద్ అలీ
దివ్యాంగులకు చక్రాల కుర్చీలు పంపిణీ చేస్తున్న హోంశాఖ మంత్రి మహమూద్ అలీ

ఇవీచూడండి:'కేసీఆర్​కు హరిత కానుక ఇవ్వడానికే.. కోటి వృక్షార్చన'

ABOUT THE AUTHOR

...view details