తెలంగాణ

telangana

ETV Bharat / city

'కరోనా తొందరగా పోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి తొందరగా పోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి పేర్కొన్నారు. నాంపల్లిలో ఆయన పేద బ్రాహ్మణులకు నిత్యావసరాలు అందజేశారు. పేదలకు సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.

By

Published : Aug 5, 2020, 1:12 PM IST

ts government advisor kv ramana chary said Corona go fast prays to God
'కరోనా తొందరగా పోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'

హైదరాబాద్​లోని నాంపల్లిలో పేద బ్రాహ్మణులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి స్థానిక ఉత్పత్తుల కేంద్రం ఆధ్వర్యంలో బియ్యంతోపాటు నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా ప్రభావంతో అనేక రంగాల్లో పలువురు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కేంద్రం ద్వారా వేలాదిమంది నిరుపేదలకు సరకులను పంపిణీ చేస్తున్నట్లు రమణాచారి తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

'కరోనా తొందరగా పోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా'

ఇదీ చూడండి :తెలంగాణలో కొత్తగా 2,012 కరోనా పాజిటివ్ కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details