తెలంగాణ

telangana

ఫుట్​బాల్​ ఆడుతూ వినూత్న నిరసన

టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించి పోస్టింగ్​ ఇవ్వాలని ప్రగతి భవన్​ ముట్టడికి వెళ్లిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్​ స్టేడియంకు తరలించారు. అక్కడ అభ్యర్థులు ప్రభుత్వం తమను ఫుట్​బాల్​లాగా ఆడుకుంటోందని వినూత్న రీతిలో ఫుట్​బాల్​ ఆడుతూ నిరసన తెలిపారు.

By

Published : Oct 1, 2019, 10:42 PM IST

Published : Oct 1, 2019, 10:42 PM IST

ఫుట్​బాల్​ ఆడుతూ వినూత్న నిరసన

ఫుట్​బాల్​ ఆడుతూ వినూత్న నిరసన

టీఆర్టీ, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రగతి భవన్​కు వెళ్తే తమను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని వారు ఖండించారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం సెప్టెంబర్ 30వ తేదీ లోపు టీఆర్టీ-2017, ఎస్జీటీ ఫలితాలు ప్రకటించాలని టీఎస్​పీఎస్సీకి తెలియజేసిందన్నారు. కానీ నేటి వరకు కమిషన్​ నుంచి ఎలాంటి స్పందన రానందున... ఎస్జీటీ అభ్యర్థులందరూ ప్రగతి భవన్​ను ముట్టడించామని తెలిపారు. అభ్యర్థులను అరెస్టు చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. వారు అక్కడ వినూత్నంగా నిరసన తెలిపారు. తమను ప్రభుత్వం ఫుట్​బాల్​లాగా ఆడుకుంటోందని... అభ్యర్థులు ఫుట్​బాల్​ ఆడుతూ నిరసన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details