తెలంగాణ

telangana

తెరాస సభ్యత్వ నమోదును ఈనెల 31 వరకు పూర్తి చేయాలి : కేటీఆర్​

By

Published : Jul 27, 2021, 2:44 PM IST

Published : Jul 27, 2021, 2:44 PM IST

Updated : Jul 27, 2021, 8:38 PM IST

ETV Bharat / city

తెరాస సభ్యత్వ నమోదును ఈనెల 31 వరకు పూర్తి చేయాలి : కేటీఆర్​

ktr met with general secretaries
ktr met with general secretaries

14:42 July 27

తెరాస ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ భేటీ

తెరాస సభ్యత్వ నమోదును ఈనెల 31 వరకు పూర్తి చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో ప్రగతిభవన్​లోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ సభ్యత్వ నమోదుపై నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. తెరాస సభ్యత్వం సుమారు 65 వేలకు చేరడంపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పాతబస్తీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కొంచెం కష్టపడితే మరింత పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

కార్యకర్తల ప్రమాద బీమా ఈనెలాఖరుతో ముగుస్తున్నందున.. ఆగస్టు 1 నుంచి కొత్త సభ్యత్వాల ప్రకారం బీమా కల్పించాలని సమావేశంలో నిర్ణయించారు. ఆగస్టు 1న బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించేలా కార్యచరణ రూపొందించారు. ఇప్పటి వరకు సమారు 50 వేల సభ్యత్వాల డిజిటలీకరణ పూర్తయిందని.. ఈనెలాఖరులోపే మిగతావి పూర్తి చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆగస్టు 1న మరోసారి సమావేశం నిర్వహించుకుందామని పార్టీ ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ తెలిపారు. జిల్లా, రాష్ట్ర కమిటీల ఏర్పాటు, జిల్లా కార్యాలయాల నిర్మాణంపై తదితర అంశాలపై ఆరోజున సమగ్రంగా చర్చించుకోవచ్చునని ప్రధాన కార్యదర్శులకు కేటీఆర్ తెలిపారు.

ఇదీచూడండి:VENKAIAH NAIDU: 'రామప్పకు యునెస్కో గుర్తింపు లభించడం దేశానికే గర్వకారణం'

Last Updated : Jul 27, 2021, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details