TRS Campaign in UP: జాతీయ స్థాయి రాజకీయ కూటమి దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై దృష్టి సారించింది. కూటమి ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షించేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తోంది. దేశ రాజకీయాలపై ప్రభావం చూపించే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా రంగంలోకి దిగాలని భావిస్తోంది. భాజపాకు వ్యతిరేకంగా... సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాలని యోచిస్తోంది. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేతృత్వంలో ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ నేతలతో కూడిన బృందం యూపీ వెళ్లాలని భావిస్తోంది. అవసరమైతే సీఎం కేసీఆర్ కూడా ఒక సభలో పాల్గొనాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.
అఖిలేష్ యాదవ్తో చర్చించి..
ప్రచారాస్త్రాల కోసం భాజపా వ్యతిరేక అంశాలపై అధ్యయనం చేస్తోంది. సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్తో చర్చించి.. త్వరలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. యూపీలో సమాజ్వాదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని.. అక్కడి నేతలతో సంప్రదింపుల అనంతరం ప్రచారంపై నిర్ణయం తీసుకుంటామని కేటీఆర్ ఇటీవలే ట్విట్టర్లో కూడా వెల్లడించారు. ఇతర రాష్ట్రాల ప్రచారంలో గతంలోనూ తెరాస పాల్గొంది. ఝార్ఖండ్లో 2009 ఎన్నికల్లో శిబుసోరెన్కు మద్దతుగా తెరాస బృందం ప్రచారం నిర్వహించింది. కర్ణాటకలో 2018లో కేసీఆర్ ప్రచారానికి వెళ్లాలని భావించినప్పటికీ.. వీలు కాకపోవడంతో తెలుగు ప్రజలంతా జేడీఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు.
భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు..