లంచమివ్వనిదే అక్కడ పని జరగదు.. ఏది కావాలన్నా డబ్బులు ముట్టజెప్పాల్సిందే.. పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వం ఎంత చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉంటోంది. టీఎస్పీడీసీఎల్లో ఇద్దరు ట్రాన్స్కో డీఈల అవినీతి బాగోతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల ఫిర్యాదుతో ట్రాన్స్కో విభాగంలో పనిచేసే ఇద్దరు డివిజినల్ ఇంజినీర్లను.. గంటల వ్యవధిలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
లంచం వాయిదా పద్దతిలో చెల్లించమన్నాడు...
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల డీఈప్రసాద్రావు.. గుత్తేదారుకు అనుకూలంగా వ్యవహరించేందుకు 30వేలు డిమాండ్ చేశాడు. ముందుగానే గుత్తేదారు 25వేలు ప్రసాద్రావుకు ఇచ్చాడు. తుది వాయిదా కింద 5వేలు ఇస్తుండగా అనిశా అధికారులు దాడిచేసి పట్టుకున్నారు. అనంతరం ఇళ్లు, కార్యాలయంలో అధికారులు సోదాలు చేశారు.
సంతకం కావాలంటే 25 వేలు కట్టాల్సిందే..
మెహదీపట్నం నానల్నగర్ వద్ద.. సైబర్ సిటీ సర్కిల్ డీఈ వెంకటరమణ.. గుత్తేదారు అంచనా వ్యయాన్ని అనుమతించేందుకు 25 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా అధికారులు పట్టుకున్నారు. ఆ తర్వాత మాదాపూర్లోని స్వగృహంలో సోదాలు చేయగా కళ్లు చెదిరే అక్రమాస్తులు బయపడ్డాయి.