తెలంగాణ

telangana

ETV Bharat / city

రైలు ఢీకొని మహిళ మృతి

శివరాంపల్లి రైల్వేస్టేషన్​ పరిధిలో ప్రమాదం జరిగింది. శివరాంపల్లి, ఫలక్​నుమా మధ్యలో యశ్వంత్​పూర్​ ఎక్స్​ప్రెస్​ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.

By

Published : Oct 2, 2019, 6:58 AM IST

రైలు ఢీకొని మహిళ మృతి

శివరాంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శివరాంపల్లి, ఫలక్​నుమా మధ్యలో ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలు దాటుతుండగా యశ్వంత్​పూర్ ఎక్స్​ప్రెస్​ రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలు పక్కనే ఉన్న రోషన్​కాలనీకి చెందిన మహిళ అని... మొగల్స్ కాలనీలో ఉన్న పేపర్ మిల్స్​కి పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.

రైలు ఢీకొని మహిళ మృతి

ABOUT THE AUTHOR

...view details