శివరాంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో శివరాంపల్లి, ఫలక్నుమా మధ్యలో ఉదయం పది గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని మహిళ రైలు పట్టాలు దాటుతుండగా యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలు పక్కనే ఉన్న రోషన్కాలనీకి చెందిన మహిళ అని... మొగల్స్ కాలనీలో ఉన్న పేపర్ మిల్స్కి పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించామని కాచిగూడ రైల్వే పోలీసులు తెలిపారు.
రైలు ఢీకొని మహిళ మృతి
శివరాంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగింది. శివరాంపల్లి, ఫలక్నుమా మధ్యలో యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందింది.
రైలు ఢీకొని మహిళ మృతి