తెలంగాణ

telangana

ETV Bharat / city

తమ పరిధిలోని కేసు కాదనటంతో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం - Suicide attempt by an elderly couple in Palmeru, Krishna district

ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో విషాదం జరిగింది. వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఆస్తి తగదా విషయంలో తమపై దాడిచేశారని పోలీసులను ఆశ్రయిస్తే.. ఇది తమ పరిధిలోని అంశం కాదు.. ఎమ్మార్వో దగ్గరికి వెళ్లమని చెప్పారు. మనస్థాపానికి గురైన ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.

Suicide attempt of an elderly couple
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

By

Published : Mar 3, 2021, 10:20 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా పామర్రు పోలీస్​స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పామర్రు గాంధీనగర్​కు చెందిన చిలంకుర్తి గోపాలకృష్ణ, దుర్గలకు చెందిన స్థలం విషయంలో వివాదం నెలకొంది. ఈ స్థలానికి సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని దంపతులు చెబుతున్నారు.

ఒంటిపై డీజిల్ పోసుకుంటున్న వృద్ధ దంపతులు

అయితే.. సుమారు 25 మంది మంగళవారం వచ్చి కళ్లలో కారంకొట్టి దాడి చేశారని వృద్ధ దంపతులు వాపోయారు. తాము పోలీస్​స్టేషన్​కు వెళ్లి విషయంపై ఫిర్యాదు చేయగా ఈ కేసు సివిల్‌ అంశమని, తహసీల్దార్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. మనస్థాపానికి గురైన వారు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్యహత్యకు యత్నించారు.

వివరాలు వెల్లడిస్తున్న వృద్ధురాలు

ఇదీ చదవండీ..యువతిపై దాడి కేసు విచారణలో కీలక విషయాలు...

ABOUT THE AUTHOR

...view details