ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రు పోలీస్స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. పామర్రు గాంధీనగర్కు చెందిన చిలంకుర్తి గోపాలకృష్ణ, దుర్గలకు చెందిన స్థలం విషయంలో వివాదం నెలకొంది. ఈ స్థలానికి సంబంధించి తమ వద్ద డాక్యుమెంట్లు ఉన్నాయని దంపతులు చెబుతున్నారు.
తమ పరిధిలోని కేసు కాదనటంతో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం - Suicide attempt by an elderly couple in Palmeru, Krishna district
ఏపీలోని కృష్ణా జిల్లా పామర్రులో విషాదం జరిగింది. వృద్ధ దంపతులు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. ఆస్తి తగదా విషయంలో తమపై దాడిచేశారని పోలీసులను ఆశ్రయిస్తే.. ఇది తమ పరిధిలోని అంశం కాదు.. ఎమ్మార్వో దగ్గరికి వెళ్లమని చెప్పారు. మనస్థాపానికి గురైన ఆ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.
![తమ పరిధిలోని కేసు కాదనటంతో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం Suicide attempt of an elderly couple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10853204-998-10853204-1614766692749.jpg)
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
ఒంటిపై డీజిల్ పోసుకుంటున్న వృద్ధ దంపతులు
అయితే.. సుమారు 25 మంది మంగళవారం వచ్చి కళ్లలో కారంకొట్టి దాడి చేశారని వృద్ధ దంపతులు వాపోయారు. తాము పోలీస్స్టేషన్కు వెళ్లి విషయంపై ఫిర్యాదు చేయగా ఈ కేసు సివిల్ అంశమని, తహసీల్దార్ దగ్గరకు వెళ్లాలని సూచించారు. మనస్థాపానికి గురైన వారు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్యహత్యకు యత్నించారు.
వివరాలు వెల్లడిస్తున్న వృద్ధురాలు
ఇదీ చదవండీ..యువతిపై దాడి కేసు విచారణలో కీలక విషయాలు...