తెలంగాణ

telangana

By

Published : Aug 30, 2020, 8:59 PM IST

ETV Bharat / city

టాప్​ టెన్ న్యూస్ @9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9pm
టాప్​టెన్ న్యూస్ @9pm

1. కేసీఆర్ పూజ..

ప్రగతిభవన్​లోని గణపతి విగ్రహం వద్ద కేసీఆర్​ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మనవడు హిమాన్షును ఆశీర్వదించారు కేసీఆర్​ దంపతులు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. గ్రీన్ స్పేస్ ఇండెక్స్..

పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు... 'గ్రీన్ స్పెస్ ఇండెక్స్' పేరుతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. అత్యుత్తమంగా నిలిచిన మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం అవార్డులు ఇవ్వనున్నట్టు మంత్రి వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. స్వర్ణ భారత్

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌ చరిత్ర సృష్టించింది. తొలిసారి అంతర్జాల వేదికగా నిర్వహించిన ఈ పోటీలో రష్యాతో కలిసి ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 93 ఏళ్ల ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో చరిత్రలో భారత్‌ తొలిసారి స్వర్ణం సాధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. కాంగ్రెస్ నాశనమే..

కాంగ్రెస్​ పార్టీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​. పార్టీ పగ్గాలు చేపట్టనివ్వకుండా రాహుల్​ను​ అడ్డుకుంటే కాంగ్రెస్​ నాశనమైపోతుందన్నారు. పార్టీ సీనియర్​ నాయకులు సోనియా గాంధీకి లేఖ రాయడాన్ని రౌత్​ తప్పుబట్టారు​. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. కర్ణాటకలో ఒక్కరోజే..

భారత్​లో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. ఇప్పటికే 35 లక్షల మందికి పైగా మహమ్మారి బారిన పడ్డారు. 63 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్​ప్రదేశ్​, దిల్లీల్లో భారీగా కొవిడ్​ బాధితులు పెరుగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. పునః పరిశీలన

కోర్టు ధిక్కరణ అంశంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్​కు విధించిన శిక్షపై సుప్రీం ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. అయితే ప్రశాంత్​కు విధించిన శిక్షను సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 122 మంది న్యాయ విద్యార్థులు లేఖ రాశారు. న్యాయ వ్యవస్థపై గౌరవంతో చేసే విమర్శలను కోర్టు ధిక్కారంగా పరిగణించకూడదని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. గాల్లోకి చిన్నారి

తైవాన్ హిన్చులో నిర్వహించిన భారీ పతంగుల కార్యక్రమంలో మూడేళ్ల బాలిక గాలిపటంతో పాటే పైకి ఎగిరింది. దాదాపు 10 మీటర్లు గాల్లోకి ఎగిరిన బాలిక సురక్షితంగానే బయటపడగలిగింది. అక్కడే ఉన్న వ్యక్తులు బాలికను కింద పడకుండా పట్టుకున్నారు. చిన్నారికి ఎలాంటి గాయాలు కాలేదు. ఘటన అనంతరం కైట్ ఫెస్టివల్​ను అధికారులు రద్దు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ధోనీ పానీపూరీ..

టీమ్​ఇండియా మాజీ సారథి​ ధోనీ.. గతంలో తన సహచర ఆటగాళ్లకు పానీపూరి వడ్డిస్తూ కనిపించాడు. ఆ వీడియో మరోసారి మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. తిరిగి చెల్లించాలి..

ఎలక్ట్రానిక్​ చెల్లింపుల విషయంలో బ్యాంకులకు కీలక సూచనలు చేసింది కేంద్ర ఆర్థికశాఖ. ఈ తరహా లావాదేవీలపై ఎటువంటి రుసుములు వసూలు చేయరాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. సడక్ జలక్

ఆలియా భట్ 'సడక్ 2' సినిమా, ఐఎమ్​డీబీ చరిత్రలోనే అతి తక్కువ రేటింగ్​తో చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ చిత్రం వరకు సరే కాని రానున్న కాలంలోనూ ఇలాంటి పరిణామాలే ఎదురైతే మాత్రం బాలీవుడ్​పై తీవ్ర ప్రభావం పడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details