1. సామూహిక వ్యవసాయం
పెట్టుబడులు తగ్గించుకుని ఆదాయం పెంచుకునేలా రైతులను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులును కోరారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసిన గోవిందరాజులుతో పలు అంశాలపై చర్చించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2 .వాయిదా వేయాల్సిందే..
కరోనా నేపథ్యంలో అన్ని పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. కొవిడ్ సమయంలో పరీక్షలు ఏంటని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల జీవితాలతో కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పంచాయతీలో పార్టీ..
గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ భర్త ... తన అనుచరులతో కలిసి మందు పార్టీ చేసుకున్నారన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చించాల గ్రామంలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. రెండే ఆప్షన్స్
జీఎస్టీ పరిహారం చెల్లింపులకు సంబంధించి రాష్ట్రాలకు రెండు మార్గాలను ప్రతిపాదించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాదికి మొత్తం చెల్లించాల్సిన పరిహారం రూ.3 లక్షల కోట్లు కాగా.. ఆదాయం పోను రూ.2.35 లక్షల కోట్ల లోటు ఏర్పడుతుందని కేంద్రం తెలిపింది. వీటిని ఆర్బీఐ ద్వారా పొందేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. సూటు బూటు సర్కార్..!
కేంద్రంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. పెద్ద వ్యాపారాలకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తున్న ప్రభుత్వం.. మధ్యతరగతి ప్రజలకు రుణాలపై వడ్డీని మినహాయించడం లేదని విమర్శించారు. ప్రభుత్వాన్ని సూటు బూటు సర్కారుగా అభివర్ణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.