1. ఎదురుచూస్తున్నా..
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కలిసి చర్చాగోష్ఠిలో పాల్గొనేందుకు... చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫిబ్రవరి 22,23 తేదీల్లో వర్చువల్ విధానంలో బయో ఆసియా సదస్సు జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. నిరూపిస్తే.. తప్పుకుంటా
తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి... ప్రతిపక్షాలకు సవాలు విసిరారు. తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షా 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నిరూపిస్తానని... లేనిపక్షంలో పోటీ నుంచి తప్పుకుంటానని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. గంటలోనే..
ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమానికి ప్రజలంతా మద్దతివ్వాలని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఫిబ్రవరి 17న ఒక గంటలో కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. ఎంతో సంతోషించా..
సొంత వాళ్లు ఆపదలో ఉన్నారంటేనే.. సాయం చేసేందుకు మొహం చాటేసే రోజులివి! మరి ఏ బంధమూ లేని వ్యక్తికి సాయం చేయాలంటే? అది కూడా అవయవం దానం చేయాలంటే.. ఇంకెంత ఆలోచించాలి? కానీ, ఓ మహిళ ఇలా.. ఆలోచనల వద్దే ఆగిపోలేదు. ఓ అనాథకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఆమె చేసిన త్యాగాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం మెచ్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రూ.5 భోజనం..
బంగాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు మరో పథకాన్ని తీసుకొచ్చింది దీదీ సర్కార్. పేదలకు తక్కువ ధరకే భోజనం అందించాలనే లక్ష్యంతో 'మా' క్యాంటీన్లను ప్రారంభించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ క్యాంటీన్లో ఐదు రూపాయలకే ప్లేట్ భోజనం లభిస్తుందని ఆమె తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.