1. తెలంగాణే ముఖ్యం..
రాష్ట్రపతి ప్రసంగానికి నిరసన తెలిపితే ఉపయోగం లేదని తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేకే అన్నారు. పార్లమెంట్ సజావుగా జరిగేందుకు కేంద్రానికి మద్దతిస్తామని తెలిపారు. తెరాస విధానం దిల్లీలో దోస్తానా.. గల్లీలో కుస్తీ కాదని... తాము ఏది చేసినా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. హామీ ఏమైంది..?
పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ ఇచ్చిన హామీ ఏమైందని... ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. చక్కెర పరిశ్రమను పూర్తిగా ప్రభుత్వ పరం చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మరిచారని ఆరోపించారు. సాగు చట్టాలపై తెరాస వైఖరిపై చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. కోళ్ల వేలం..
పోలీసుల దాడిలో పట్టుబడ్డ పందెం కోళ్లను వేలం వేయాలని పెద్దపల్లి జిల్లా మంథని కోర్టు ఆదేశించింది. ఈ నెల 14న సంక్రాంతి నాడు... తాడిచెర్ల శివారులోని దేశబందం ప్రాంతంలో కొయ్యూరు పోలీసులు దాడులు చేసి మూడు కోళ్లు, 22 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. గాంధీకి మోదీ నివాళి
నేడు మహాత్మగాంధీ వర్థంతి. ఈ సందర్భంగా దిల్లీలోని గాంధీ స్మృతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ.. మహాత్మునికి నివాళులర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. రాహుల్ కుకింగ్..
యూట్యూబ్ కుకింగ్ వీడియోలో రాహుల్ గాంధీ కనిపించడం.. ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్గా మారింది. గ్రామస్థులతో కలిసి భోజనం చేసిన ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గతవారం రాహుల్ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.