తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jan 26, 2021, 2:59 PM IST

topten news @3PM
టాప్​టెన్​ న్యూస్ @3PM

1. సీఎం శుభాకాంక్షలు

ప్రగతి భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. తెంలగాణే ముందు..

దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ మార్గదర్శకంగా నిలుస్తోందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. కరోనాను కేసీఆర్ సర్కార్ దీటుగా ఎదుర్కొందని తెలిపారు. 72వ గణతంత్ర వేడుకల్లో భాగంగా.. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్​లో సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించిన తమిళిసై.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. సంతోషికి సన్మానం

కొవిడ్​ నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో గణతంత్ర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. కలెక్టరేట్​లో కలెక్టర్​ అనితా రామచంద్రన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గల్వాన్​లోయలో వీర మరణం పొందిన కర్నల్​ సంతోష్​ కుమార్​ భార్యను కలెక్టర్​, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కలిసి శాలువాతో సత్కరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ఎర్రకోటపై రైతు జెండా

పోలీసులు నిర్దేశించిన మార్గాలు కాకుండా ఇతర మార్గాల్లో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు.. ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసే స్తంభానికి వేర్వేరు రైతు సంఘాల జెండాలు కట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. హస్తినలో ఉద్రిక్తత

రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో విషాదం చోటుచేసుకుంది. మధ్య దిల్లీ ఐటీఓ ప్రాంతం వద్ద ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పోలీసులకు రైతు రక్షణ

దిల్లీలో రైతుల నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. ఆదాయపన్ను శాఖ కార్యాలయం సమీపంలో కొందరు నిరసనకారులు పోలీసు అధికారిపై దాడికి యత్నించారు. అయితే అక్కడే ఉన్న కొందరు రైతులు పోలీసును కాపాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. భారీగా రుణాలు

2021-22 బడ్జెట్​లో వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని రూ.4 లక్షల కోట్లు పెంచి.. రూ.19 లక్షల కోట్లకు చేర్చే యోచలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. సెనేట్​ ముందుకు ట్రంప్ అభిశంసన

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై డెమొక్రాట్లు సంధించిన అభిశంసన అస్త్రం సోమవారం సెనేట్​కు చేరింది. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి నుంచి వైదొలిగాక అభిశంసనను ఎదుర్కొంటున్న మొదటి వ్యక్తి ట్రంప్​ కానున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. తటస్థంగా రిచర్డ్

ఫిబ్రవరి 3న ప్రారంభంకానున్న వెస్డిండీస్​-బంగ్లాదేశ్​ మధ్య తొలి టెస్టుకు తటస్థ అంపైర్​ను నియమించింది ఐసీసీ. అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్​ ఎలీట్​ ప్యానెల్​లో బంగ్లాదేశ్​ తరఫున అంపైర్​ లేనందున ఈ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా లాక్​డౌన్​ తర్వాత రిచర్డ్​ తొలి తటస్థ అంపైర్​గా నియమితుడయ్యాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. క్షమించండి..

సూరజ్ వెంజరముడు, నిమిష సజయన్​ ప్రధానపాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ కిచెన్'. జనవరి 15న ఓటీటీ సంస్థ నీ స్ట్రీమ్ ప్లాట్​ఫామ్​లో విడుదలైంది. అయితే చాలా మంది ఈ చిత్రాన్ని పైరసీ కాపీ ద్వారా వీక్షించారట. కానీ సినిమా చాలా బాగుందని.. నిర్మాతకు టికెట్ డబ్బులు పంపిస్తామని తెలిపారట. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details