తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2020, 10:58 AM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​ @11am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @11am
టాప్​టెన్ న్యూస్​ @11am

1. కొత్త కేసులు 1,256

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,256 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌లో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. స్వదేశీ వ్యాక్సిన్

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై చెన్నై ఇంటర్నేషనల్‌ సెంటర్‌ సభ్యులతో జరిగిన చర్చాగోష్ఠిలో భారత్‌ బయోటెక్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ కృష్ణ ఎల్ల పాల్గొన్నారు. అత్యుత్తమ నాణ్యతతోనే కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. సామర్థ్యానికి మించి..

ఉస్మానియా ఆసుపత్రి శవాగారానికి ఇటీవలి కాలంలో మృతదేహాల తాకిడి అధికమైంది. సామర్థ్యానికి మించి మృతదేహాలు తీసుకువస్తుండటంతో స్థలం సరిపోక ఇబ్బందులు తప్పడం లేదు. గత్యంతరం లేని స్థితిలో శవాల గదిలోని స్ట్రెచర్లపైనే సిబ్బంది వాటిని భద్రపరుస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. సబ్​మెరైన్​ ప్రారంభం

అండమాన్​కు మెరుగైన సమాచారం అందించే విధంగా ఏర్పాటు చేసిన సబ్​మెరైన్ కేబుల్ వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చెన్నై నుంచి పోర్ట్​ బ్లెయిర్​ సహా మరో ఏడు ద్వీపాలకు సముద్రగర్భంలో సబ్​మెరైన్ కేబుళ్లను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఎంత పలికిందంటే..?

గాంధీ అనగానే గుండ్రటి అద్దాలు.. బంగారు పూత పూసిన కళ్లజోడుతో బోసినవ్వులు చిందిస్తున్న ఆయన ముఖమే కళ్లముందు కదలాడుతుంది. అవి లేని గాంధీ చిత్రపటం కనపడటం చాలా అరుదు. ఆ స్థాయిలో ప్రసిద్ధికెక్కాయి ఆ అద్దాలు. మరి, ఆయన ధరించిన ఆ అద్దాలను వేలం వేస్తే..? అవును, ఆనాటి గాంధీ కళ్లజోడును ఇప్పడు బ్రిటన్.. అంతర్జాతీయ​ వేలంపాటలో పెట్టింది. మరి, స్పందన ఎలా ఉందో తెలుసా? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. శుభారంభం

స్టాక్​ మార్కెట్లు సోమవారం లాభాలతో ఆరంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 228 పాయింట్ల లాభంతో 38 వేల 269 వద్ద ట్రేడవుతోంది. 50 షేర్ల సూచీ నిఫ్టీ 67 పాయింట్ల వృద్ధితో 11 వేల 281 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. ఉగ్రరూపం

దేశంలో కరోనా విలయం రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. వరుసగా నాలుగో రోజు దేశంలో 60 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1007 మంది ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. కొత్త ఛైర్మన్​

దుబాయ్​లో ఆగస్టు 10న జరిగే ఐసీసీ వర్చువల్​ భేటీలో.. కొత్త అధ్యక్షుడి నామినేషన్​ ప్రక్రియ గురించి ప్రధానంగా చర్చించనున్నారు. ఈ పదవి రేసులో కోలిన్‌ గ్రేవ్స్‌, డేవ్‌ కామెరాన్‌, ఇమ్రాన్‌ ఖవాజా తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ముగ్గురిలో ధోనీ ఒకడు..

ఆటను అర్థం చేసుకోవడంలో ధోనీతో పాటు మరో ఇద్దరు క్రికెటర్లు ఉన్నారని చెప్పిన మాజీ అంపైర్ సైమన్ టాఫెల్.. వారిని 'బిగ్గెస్ట్ క్రికెటింగ్ మైండ్స్' అని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఆర్టికల్​ 15

విభిన్న చిత్రాలు చేస్తూ ఆకట్టుకుంటున్న నటుడు అడివి శేష్.. 'ఆర్టికల్ 15' రీమేక్​లోనూ నటించనున్నాడట. ఈ విషయమై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details