తెలంగాణ

telangana

By

Published : Sep 3, 2020, 1:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్​@1 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOPNEWS
టాప్​ న్యూస్​@1 PM

1. కేసీఆర్ సమీక్ష

శాసనమండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రులతో భేటీ అయ్యారు.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. ఏపీ సర్కారుకు మరోసారి చుక్కెదురు

ఏపీ సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను తొలగించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌

భాజపా నేత రాజాసింగ్ వ్యక్తిగత ఖాతాలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తొలగించింది. విద్వేషపూరిత పోస్టులు పెట్టడంపై ఖాతాను నిషేంధిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.గోదావరి తీరంలో యథేచ్చగా ఇసుక అక్రమ రవాణా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్చగా సాగుతోంది. కొందరు పెద్దల అండదండలతో ఇసుక రవాణా మణుగూరు నుంచి హైదరాబాద్ వైపు పరుగులు తీస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.కంటెయిన్​మెంట్​ జోన్లలో పరీక్ష కేంద్రాలొద్దు

కరోనా వేళ దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఈ నెలాఖరులోపు తుది పరీక్షలు నిర్వహించేందుకు యూజీసీ గడువు విధించింది. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కంటెయిన్​​మెంట్ జోన్లలో పరీక్ష కేంద్రాలు పెట్టొద్దని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.ఆగస్టులో మెరుగైన సేవా రంగం.. కానీ!

దేశంలో సేవారంగ కార్యకలాపాలు ఇంకా ఒడుదొడుకుల్లో ఉన్నాయి. అయితే ఆగస్టులో సేవా రంగ పీఎంఐ జులైతో పోలిస్తే కాస్త మెరుగై 41.8గా నమోదైనట్లు ఐహెచ్​ఎస్​ మార్కిట్ నెలవారీ నివేదికలో తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.అధ్యక్ష ఎన్నికలకు ముందే అమెరికా వ్యాక్సిన్​!

అధ్యక్ష ఎన్నికల ముందే కరోనా వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. నవంబర్​ 1 నాటికి పంపిణీకి సిద్ధంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది ట్రంప్ ప్రభుత్వం. అయితే శాస్త్రీయంగా కాకుండా అధ్యక్ష ఎన్నికల కోసం వ్యాక్సిన్​ తీసుకొస్తున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.'ఖేల్​రత్న అవార్డు పేరు మార్చాలి'

అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్నకు, క్రీడాకారుని పేరు పెట్టాలని రెజ్లర్ బబితా ఫొగాట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అలా చేస్తే ఆటగాళ్లకు గర్వంగా ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఐపీఎల్​లో మరోసారి కరోనా కలకలం

దుబాయ్​లో ఉన్న తమ వైద్యబృందంలోని వ్యక్తికి కరోనా పాజిటివ్​గా​ తేలిందని బీసీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడు ఐసోలేషన్​లో చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.డ్రగ్స్​ కేసులో స్టార్​ హీరోయిన్​కు నోటీసులు

డగ్స్ కేసు విచారణలో భాగంగా నటి రాగిణికి నోటీసులు జారీ చేసింది. తమ ప్రధాన కార్యాలయం ఎదుట గురువారం ఆమె హాజరు కావాలని చెప్పింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details