తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 7 PM - top ten news till now

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news till now 7 pm
టాప్​టెన్​ న్యూస్​ @ 7 PM

By

Published : May 11, 2021, 6:59 PM IST

మినహాయింపు వీటికే.!

వ్యవసాయ, అనుబంధ రంగాలు, ఫార్మా, ఆస్పత్రులు, మెడికల్‌ షాపులు, పెట్రోల్‌ పంపులు, శీతల గిడ్డంగులు, మీడియాకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. బ్యాంకులు, ఏటీఎంల నిర్వహణకు సడలింపులు ఉండనున్నాయి. 33 శాతం సిబ్బందితో ప్రభుత్వ కార్యాలయాలు నడవాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరో 4801 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్దృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో తాజాగా మరో 4801 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి మరో 32 మంది మరణించారు. 7403 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 60,136 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఆ సమయంలో తెరిచే ఉంటాయి'

లాక్​ డౌన్​ విధించినా ఉదయం 6 నుంచి 10 వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ఆబ్కారీ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

మరోసారి భేటీ

ఈనెల 20న మరోమారు మంత్రివర్గ సమావేశం కానుంది. లాక్‌డౌన్‌ కొనసాగింపు విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. యుద్ధప్రాతిపదికన టీకాలు సమకూర్చుకోవాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!

సంపూర్ణ లాక్​డౌన్ విధించనప్పటికీ.. దాదాపు దేశమంతా ఆంక్షల బాటలోనే కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్​డౌన్​లు విధిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' సెకండ్​ వేవ్​ తగ్గుముఖం!'

దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా సెకండ్​ వేవ్​ తగ్గుముఖం పడుతుందనేందుకు ఇది సంకేతమని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఏటీఎంల వద్దే పడిగాపులు

మయన్మార్​లో సైనిక పాలన కారణంగా ఆర్థిక సంక్షోభం తలెత్తింది. బ్యాంకింగ్ సేవలు పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో ప్రజలు నగదు డ్రా చేసుకునేందుకు ప్రజలు ఏటీఎం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఒక్కో ఏటీఎంలో రోజూవారీ నగదు డ్రాకు పరిమితి విధిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

స్వల్పంగా తగ్గిన బంగారం

పసిడి ధర కాస్త తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర మంగళవారం రూ.200పైగా దిగొచ్చింది. వెండి ధర కిలో ఏకంగా రూ.71 వేల మార్క్ దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ధావన్​కే నా ఓటు'

శ్రీలంక పర్యటనలో భారత జట్టుకు ధావన్​ సారథిగా వ్యవహరిస్తాడని తాను భావిస్తున్నట్లు చెప్పాడు టీమ్​ఇండియా మాజీ ఆటగాడు దీప్​దాస్​ గుప్తా. ఇంగ్లాండ్​ సిరీస్​కు భువనేశ్వర్​ ఎంపికవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

లండన్​లోనూ వారికి ఇళ్లు ​!

బాలీవుడ్​కు చెందిన పలువురు తారలకు లండన్​లోనూ సొంత గృహాలు ఉన్నాయి. షారుక్​తో పాటు పలువురు అక్కడ ప్రాపర్టీ కొనుగోలు చేశారు. వారెవరో చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details