ఏపీ ఎంపీ అరెస్టు
ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు... హైదరాబాద్లో అరెస్టు చేశారు. రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ పోలీసులు... ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఏపీ సీఐడీ పోలీసులను సీఆర్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'2 కోట్ల మంది జయించారు'
దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 కోట్లు దాటింది. గత నాలుగు రోజుల్లో మూడుసార్లు కొత్తగా నమోదైన కేసుల సంఖ్య కన్నా రికవరీలే ఎక్కువగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో టీకా తీసుకున్న వారి సంఖ్య 18 కోట్లకు చేరువైనట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8 వేల మంది మిస్సింగ్!
బెంగళూరులో 8 వేల మందికి పైగా కరోనా బాధితుల జాడ తెలియటం లేదని బెంగళూరు మహానగర పాలక సంస్థ, రాష్ట్ర వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది బాధితులు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. స్థానిక పోలీస్ అధికారుల ద్వారా బాధితులను గుర్తిస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఎవరైనా చికిత్స పొందొచ్చు
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారిని అడ్డుకోవడంలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి కరోనా చికిత్స కోసం వచ్చే వారు ముందుగానే... ఆస్పత్రిలో పడకను రిజర్వు చేసుకోవాలని అన్నారు. పడకలు రిజర్వు చేసుకోకుండా రాష్ట్రానికి వచ్చి ఇబ్బందులు పడొద్దని.. విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జంట నగరాలను ముంచెత్తింది.!
ఎండ తీవ్రత వల్ల ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న భాగ్యనగర వాసులు ఉపశమనం పొందారు. ఉదయం నుంచి వేడిగా ఉన్న వాతావరణం.. సాయంత్రానికి కురిసిన జోరువానతో చల్లబడింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.