తెలంగాణ

telangana

By

Published : Jul 17, 2021, 9:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM

కొత్తగా 729 కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 729 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్​తో ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,980 యాక్టివ్‌ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

​ ఉపఎన్నికపై పీసీసీ .!

హుజూరాబాద్​ ఉప ఎన్నికపై రాష్ట్ర కాంగ్రెస్​ దృష్టి సారించింది. హైదరాబాద్​లోని గాంధీభవన్​లో పీసీసీ కార్యవర్గం సమావేశమై ఉపఎన్నికపై చర్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రేపటి నుంచే ఓపెన్

సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ కోరింది. ఈ మేరకు ఛాంబర్‌ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శనివారం కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

''త్వరలోనే 'తెలంగాణ చేపలు'

రాష్ట్రంలో 'తెలంగాణ చేపలు' బ్రాండ్​ పేరిట మార్కెటింగ్​ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ పేర్కొన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అన్ని మండలాల్లో వనాలు'

పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లోని మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు తెలిపారు. అన్ని గ్రామీణ మండలాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు కోసం 5300 ఎకరాల భూమిని గుర్తించినట్లు ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'మోదీవల్లే సాధ్యమైంది'

ప్రధానిగా నరేంద్ర మోదీ వల్లే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం లభించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. దేశ సార్వభౌమత్వాన్ని సవాల్​ చేసే వారికి అదే రీతిలో సమాధానమిస్తామని హెచ్చరించారు. డ్రోన్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. స్వదేశీ యాంటీ డ్రోన్​ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'అక్టోబర్ 1 నుంచేె'

అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ వెల్లడించింది. ఆగస్టు 31 లోపు చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఈనెల 19 నుంచే.!

దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ నెల 19 నుంచి అన్​ రిజర్వ్​డ్​ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో సమానంగా ఈ రైళ్లు నడపబడతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఓ ఇంటివాడైన భారత ఆల్​రౌండర్​

భారత ఆల్​రౌండర్ శివమ్​ దూబే ఓ ఇంటివాడయ్యాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు దూబే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ ఇయర్​ఫోన్స్ ధర ఎంతో తెలుసా!

ఓ సంస్థకు చెందిన ఇయర్​ఫోన్స్​ ధర ఏకంగా లక్ష రూపాయలు పలుకుతోంది. మరి ఈ ఇయర్​ఫోన్స్​ విశేషాలేంటో తెలుసుకోండి.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details