తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2021, 8:52 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్​ న్యూస్​ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM

బోర్డు సమావేశం వాయిదా

శుక్రవారం జరగాల్సిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశం తేదీని త్వరలో వెల్లడిస్తామన్న కేఆర్‌ఎంబీ తెలిపింది. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంతో కేఆర్‌ఎంబీ భేటీ కీలకంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అదే వైఎస్‌ఆర్‌టీపీ లక్ష్యం

వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందంగా ఉందని షర్మిల హర్షం వ్యక్తం చేశారు. సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ స్థాపించినట్లు ఆమె పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'తెలంగాణలో తిరుగులేదు'

తెలంగాణలో తెరాసను ఢీకొట్టే వాళ్లు లేరని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కొవాలంటే డైలాగ్‌లు కొడితే సరిపోదని ఆయన వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

పూర్వ వైభవం తెస్తా

పక్కా ప్రణాళికలతో.. కొవిడ్ వల్ల కుదేలైన పర్యాటక రంగానికి పూర్వవైభవం తీసుకువస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేబినెట్‌ మంత్రిగా పదోన్నతి పొందిన ఆయన.. తనకు కేటాయించిన శాఖల బాధ్యతల్ని చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సఖ్యతనే కోరుకుంటున్నాం

కృష్ణా జలాల (Krishna Water) విషయంలో తెలంగాణతో కొనసాగుతున్న వివాదంపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ (Ap CM Jagan) సీరియస్​గా స్పందించారు. సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందని అన్నారు. ఏపీ అనంతపురం జిల్లా రాయదుర్గంలో నిర్వహించిన బహిరంగసభలో ఈ విషయమై మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ అవకాశం లేదు

తెలంగాణలో మూడో వేవ్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం లేదని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ శ్రీనివాస రావు అభిప్రాయపడ్డారు. ప్రజలందరికీ వీలయినంత త్వరగా వ్యాక్సినేషన్ ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రైతుల కోసం లక్ష కోట్లు

అత్యవసర వైద్య మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.23,123 కోట్ల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాడవీయ తెలిపారు. ఈ అత్యవసర నిధిని కేంద్రం, రాష్ట్రాలు సంయుక్తంగా వినియోగించుకుంటాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త మంత్రులతో మోదీ!

కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే కొత్త మంత్రులను కార్యకలాపాల్లో భాగస్వాములను చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గురువారం.. కేంద్ర విద్యాసంస్థల డైరక్టర్లతో ఆయన నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ కూడా పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ట్విట్టర్‌కు వార్నింగ్‌.!

భారతదేశంలో నివసించేవారు, పనిచేసే ఏ సంస్థ అయినా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని ఐటీ శాఖ కొత్త మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్పష్టం చేశారు. రైల్వే, ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారు లేకుండానే ఒలింపిక్స్​.!

టోక్యో నగరంలో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఒలింపిక్స్​కు ప్రేక్షకులను అనుమతించట్లేదని ప్రకటించారు నిర్వాహకులు. అంతకుముందే ఆ నగరంలో అత్యయిక స్థితిని విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details