తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2021, 6:58 PM IST

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

పెరిగిన రికవరీ రేటు

రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.77 శాతానికి చేరింది. కొత్తగా 65,607 పరీక్షలు నిర్వహించగా... 465 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,31,683కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రాష్ట్రంపై ప్రభావమెంత?

ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందుకే బోనాలు ప్రత్యేకం

తెలంగాణలో బోనాల సంబురం షురూ అయింది. నేటి నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఆ ఎస్పీని బదిలీ చేయొద్దు'

ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోని తమ గ్రామాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన మల్కాన్‌గిరి ఎస్పీ రిషికేష్ కిల్లారిని బదిలీ చేయవద్దంటూ ఆ ప్రాంత గిరిజను ర్యాలీ నిర్వహించారు. మావోల ప్రాబల్యాన్ని తగ్గించి మౌలిక వసతులు కల్పించిన ఆయన... మరికొంత కాలం తమ ప్రాంతంలోనే ఉండాలని వారు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కరోనాను జయించి.. ఎవరెస్టు ఎక్కి.!

ఆత్మవిశ్వాసం తోడుంటే.. ఎన్ని వైరస్​లు అడ్డొచ్చినా అనుకున్నది సాధించొచ్చని నిరూపించాడు ఓ వ్యక్తి. కరోనా నుంచి కోలుకున్న ఏడు వారాల్లోనే.. ఎవరెస్టును అధిరోహించాడు. తన కల నెరవేరేందుకు సహకరించిన కళాశాలకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఇంతకీ అతనెవరు? ఏం చేశాడంటే..? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


వరద బీభత్సం

చైనాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు సిచువాన్‌ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. జనావాసాలు నీటిలో తేలుతున్నట్లు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.


ఆ యాత్ర ఎప్పుడంటే?

బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్ష పర్యటనకు రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో రిచర్డ్, ఆయన బృందం కలిసి నింగిలోకి దూసుకెళ్లనున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ప్రయోగించే యూనిటీ22 వ్యోమనౌక ద్వారా వీరు రోదసిలోకి వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారికి ప్రత్యేక డిస్కౌంట్​..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో విడత పసిడి బాండ్ల ఇష్యూ సోమవారం(జులై 12) నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారంతో ఇష్యూ ముగియనుంది. ఈ విడతలో గ్రాము బంగారం ధర ఎంత? డిస్కౌంట్ ఎంత ఉండనుంది? ఎవరికి ఇస్తారు? అనే వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారిద్దరిలో ఎవరు?

రానున్న టీ-20 ప్రపంచకప్​లో టీమ్ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్​మన్​గా ఎవరు ఉండాలన్న దానిపై మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా స్పందించాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేయాలా? లేదా శ్రేయస్‌ అయ్యర్‌ను తీసుకోవాలా? అనే ప్రశ్నకు జవాబు చెప్పడం చాలా కష్టమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'వాలిమై' ఫస్ట్‌లుక్‌..!

తమిళ స్టార్ హీరో అజిత్​ నటిస్తున్న 'వాలిమై' ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. దీంతో ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details