తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2021, 6:57 PM IST

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

వైఎస్​ఆర్ సంక్షేమ పాలనే లక్ష్యం

వైఎస్‌ఆర్‌ చెరగని చిరునవ్వు.. కోట్లాది ప్రజల్లో నిలిచిన సంక్షేమమే లక్ష్యంగా వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీని ఆవిష్కరిస్తున్నట్లు షర్మిల తెలిపారు. వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజునే పార్టీ ప్రకటించడం ఆనందదాయకంగా ఉందన్నారు. రాజన్న సంక్షేమ పాలన తీసుకొచ్చేందుకే వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తండ్రి కల సాకారం చేసేందుకే.!

తండ్రి కలలు సాకారం చేసేందుకే షర్మిల రాజకీయాల్లోకి వచ్చారని వైఎస్​ విజయమ్మ అన్నారు. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ పాలనకు పునాదులు పడబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్​ తెలంగాణ పార్టీ ఆవిష్కరణ సభలో పాల్గొని ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జగన్ బెయిల్ రద్దు విచారణ వాయిదా

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. గత విచారణ సమయంలో.. లిఖితపూర్వక వాదనలు సమర్పించాలన్న కోర్టు ఆదేశాలతో.. జగన్, రఘురామ లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ ప్రాజెక్టులను నిలువరించాలి

కృష్ణానదిపై తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను నిలువరించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టులతో ఏపీకి దక్కాల్సిన నీటి వాటాను తెలంగాణ కాజేస్తోందని లేఖలో ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త మంత్రుల తొలిరోజు ఇలా..!

మంత్రివర్గ పునర్వవస్థీకరణలో భాగంగా బుధవారం కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన నేతలు ఇవాళ వారివారి శాఖల బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూ తమపై ఉంచిన నమ్మకాన్ని.. నిలబెట్టుకుంటామని బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పారు. దేశాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేబినెట్ కీలక నిర్ణయం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సల్మాన్​ ఖాన్​పై కేసు

బాలీవుడ్​ నటుడు సల్మాన్​ ఖాన్​పై పోలీసులు ​కేసు నమోదు చేశారు. తనను బీయింగ్​ హ్యూమన్ షోరూం విషయంలో సల్మాన్​ మోసం చేశారని చండీగఢ్​ మనీమాజ్రా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి ఫిర్యాదు చేయగా ఈ కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కొత్త బైక్​లు రిలీజ్.!

భారత మార్కెట్లోకి రెండు కొత్త బైక్​లను విడుదల చేసింది బీఎండబ్ల్యూ. ఆర్​ 1250 జీఎస్, ఆర్​ 1250 జీఎస్ అడ్వెంచర్ మోడళ్లకు అప్​డేటెడ్​ వెర్షన్లను తీసుకొచ్చింది. ఈ బైక్​ల ధరల, ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కోటి ఆశలు ఆమెపైనే.!

ఐదేళ్ల క్రితం రియో ఒలింపిక్స్​లో వెండి పతకంతో సరిపెట్టుకున్న భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(PV Sindhu).. ప్రపంచ ఛాంపియన్​షిప్ టైటిల్(2019లో) గెలిచి తనపై వచ్చిన విమర్శలకు గట్టి సమాధానమిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

థియేటర్లలోకి తొలి సినిమా.!

కరోనా రెండో దశ ప్రభావం, లాక్​డౌన్ తర్వాత విడుదల కానున్న తొలి సినిమా 'తిమ్మరుసు'. ఈ మేరకు అధికారిక ప్రకటనతో పాటు పోస్టర్​ను గురువారం విడుదల చేశారు. అయితే ప్రభాస్ 'రాధేశ్యామ్', నాగచైతన్య 'లవ్​స్టోరి'తో పాటు ఇతర చిత్రాల విడుదలపై త్వరలో స్పష్టత రానుంది!

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details