తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jul 3, 2021, 7:00 PM IST

TOP TEN NEWS @ 7PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 7PM

నీటిపారుదలపై సీఎం కేసీఆర్​ సమీక్ష

ఏపీతో కృష్ణా జలాల వివాదం నేపథ్యంలో నీటిపారుదలపై సీఎం కేసీఆర్​ సమీక్ష నిర్వహిస్తున్నారు. నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీతో సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' చుక్క నీరు పోనివ్వం '

ఏపీ అక్రమ ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కఠినంగా వ్యవహరించనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జలవనరుల విషయంలో చుక్క నీరు నష్టపోకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కించపరిచేలా ఎవరైనా మాట్లాడితే పార్టీలకతీతంగా అందరూ ఏకతాటిపై నిలబడాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

​ 'డబ్బులిచ్చి కొనుక్కున్నాడు'

పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డిపై తెరాస ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్​ రెడ్డి విరుచుకుపడ్డారు. రాళ్లతో కొట్టాలని ఒక ఎంపీ చెప్పడం దారుణమన్నారు. రేవంత్‌ రెడ్డి.. నిషేధిత మావోయిస్టుల భాష మాట్లాడుతున్నారని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అమరిందర్ భేటీ

పంజాబ్ కాంగ్రెస్​లో (Punjab congress)​ ఏర్పడ్డ అభిప్రాయభేదాలను పరిష్కరించే దిశగా ఆ రాష్ట్ర సీఎం అమరిందర్​ సింగ్(Amarinder singh).. పార్టీ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. సిద్ధూకు పార్టీలో కీలక హోదా కట్టబెట్టడం సహా ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు అంగీకరిస్తూ అధిష్ఠానంతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అర్ధరాత్రి మూకదాడి!

అర్ధరాత్రి ఆటోలో వెళ్తున్న ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఆటో డ్రైవర్. సాయం కోసం ఆ యువతి తన ఇద్దరు మిత్రులకు సమాచారం అందించింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన మిత్రులను, యువతిని.. కొందరు గ్రామస్థుల సాయంతో చితకబాదాడు ఆ ఆటోడ్రైవర్ . పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రేమించిందని చావబాదారు'

ఓ అబ్బాయిని ప్రేమించిందన్న కారణంతో కన్నకూతురిని అమానుషంగా హింసించిన ఘటన మధ్యప్రదేశ్​ అలీరాజ్​పూర్​ జిల్లాలో వెలుగుచూసింది. బాలికను తీవ్రంగా కొట్టడమే గాక.. చెట్టుకి వేలాడదీసి కర్రలతో చావబాదిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అవి తింటే ఆస్పత్రికే..!

వాము ఆకుల్లో(dried oregano)లో హానికర బ్యాక్టీరియా బయటపడింది. చిలీ నుంచి దిగుమతి అయిన ఈ ఆకుల్లో సాల్మొనెల్లా బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించిన ఇన్ఫోసాన్​(INFOSAN)​.. భారత్​ను అప్రమత్తం చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా వాటిని విక్రయించొద్దని ఆహార పంపిణీ విభాగాలను ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ ఆదేశించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

తొలి మహిళా స్పేస్‌ టూరిస్ట్‌

నాసా నుంచి బయటకు వచ్చి ఓ ప్రైవేటు స్పేస్‌ ఫ్లైట్‌ సంస్థకు మారడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది ఓ మహిళ. గతంలో ప్రయోగించిన వ్యోమనౌకలో ప్రయాణించి, కమర్షియల్‌ స్పేస్‌ ఫ్లైట్‌లో ప్రయాణించిన తొలి మహిళగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ప్రయాణానికి సిద్ధమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ మ్యాచ్​లు అప్పటినుంచే..!

కొవిడ్​తో వెలవెలబోయిన క్రికెట్ మైదానాలు త్వరలోనే దేశవాళీ​ టోర్నీలతో కోలాహాలంగా మారనున్నాయి. ప్రతిష్ఠాత్మక రంజీ ట్రోఫీ సహా 2021-22 సీజన్​లో 2127 మ్యాచ్​లకు బీసీసీఐ షెడ్యూల్ విడుదల చేసింది.

ఆమె పెళ్లి క్యాన్సిల్.!

యువ కథానాయిక మెహరీన్.. తన పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది. ట్విట్టర్​ వేదికగా ఈ విషయమై స్పష్టత ఇచ్చింది. అయితే ఎలాంటి కారణాలను వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details