మరో 5 నెలలు
దీపావళి వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్ అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ముందే హెచ్చరించాం
తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ సర్కారు సంగమేశ్వర ప్రాజెక్టు కోసం ఏడాది కిందటే జీవో తెచ్చినా కేసీఆర్ (Kcr) పట్టించుకోలేదన్నారు. నీళ్ల యుద్ధం చేయబోతున్నట్లుగా కొత్త డ్రామాకు తెరలేపారని విమర్శలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
వాటితో ముప్పే.!
నకిలీ విత్తనాల పేరిట మాయాజాలం కొనసాగుతోంది. పెద్దమొత్తంలో విత్తనాలు దొరుకుతున్నాయి కానీ పట్టుబడినవి ఎటువంటివి... ప్రమాదకరమైనవి అందులో ఉంటున్నాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దేశంలో బీజీ-2 తరహా విత్తనాలకు అనుమతి ఉన్నా... వాటిలో నకిలీవి విపణిలో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ నిషేధిత బీజీ-3 విత్తనాలు అడ్డగోలుగా సరఫరా అవుతుండటం విపరిణామాలకు దారితీసే ప్రమాదముంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చిరు ట్వీట్కు స్పందన
అవకాశం ఉన్న ప్రతీ సందర్భంలో.. ఏపీ సీఎం జగన్ను మెగాస్టార్ చిరు పొగుడుతూనే ఉంటారు. దానిపై ఎవరికీ ఏ అభిప్రాయం ఉన్నా... చిరు అభినందనలు చెబుతూనే ఉన్నారు. తాజాగా ఈనెల 21న రాష్ట్రంలో సుమారు 13.72 లక్షల మందికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా... టీమ్ ఏపీ, సీఎం జగన్కు అభినందనలు తెలుపుతూ.. చిరు ట్వీట్ చేశారు. దానికి ముఖ్యమంత్రి రిప్లయ్ ఇచ్చారు. ఈ క్రెడిట్ అధికారులకే వెళ్తుందని రీట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
కస్టోడియల్ డెత్పై పిల్
ఓ చోరీ కేసులో విచారణకు తీసుకొచ్చిన అనుమానితురాలు అనుమానాస్పద మృతిపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై జ్యుడిషియల్ విచారణ కోరుతూ పీయూసీఎల్ ప్రధాన కార్యదర్శి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. రూ.5 కోట్ల పరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి