తెలంగాణ

telangana

By

Published : May 25, 2021, 2:59 PM IST

ETV Bharat / city

టాప్‌టెన్ న్యూస్ @ 3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS@3PM
టాప్‌టెన్ న్యూస్ @ 3PM

  • కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష...

సీతారామ ఎత్తిపోతల, దేవాదుల, సమ్మక్క ఆనకట్టపై సీఎం కేసీఆర్ సమీక్షిస్తున్నారు. సింగూరు ఆయకట్టుకు ఎత్తిపోతలు, నల్గొండ జిల్లా ఎత్తిపోతల పథకాలపై అధికారులతో చర్చ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అల కమలపురంలో...

మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భాజపాలో చేరుతున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను కలిసినప్పుడు.. ఆయన ఈటలను పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • కరోనాతో అదనపు కలెక్టర్‌ మృతి...

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య(55) మృతి చెందారు. కరోనాతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ అంజయ్య మృతి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఆనందయ్య మందుపై పరిశోధన..

ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా రోగులకు ఆనందయ్య అందించిన ఔషధంపై.. తిరుపతి ఆయుర్వేద కళాశాలలో రెండో రోజు పరిశోధన కొనసాగుతోంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • తగ్గిన పాజిటివిటీ రేటు...

దేశంలో కరోనా పాజిటివిటీ రేటు 9.54 శాతానికి తగ్గినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ కొత్త కేసుల కన్నా కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • భారీ అగ్ని ప్రమాదం...

గుజరాత్,​ ఆనంద్​ నగర్​లోని మురికివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 80 గుడిసెలు దగ్ధమయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మరింత సమాచారం కావాలి'...

కొవాగ్జిన్ టీకా అనుమతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్​ బయోటెక్​ సంస్థ మరింత సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • బిట్​కాయిన్ 19% జంప్!...

ఇటీవల వరుసగా క్షీణిస్తూ వస్తున్న బిట్​కాయిన్ విలువ మళ్లీ రికార్డు స్థాయిలో 19 శాతం పుంజుకుంది.టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్ చేసిన ఓ ట్వీట్​ ఇందుకు ప్రధాన కారణం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సుశీల్ సస్పెండ్...

సుశీల్ కుమార్​ను తన బాధ్యతల నుంచి తప్పించింది భారతీయ రైల్వే శాఖ. హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్​ ఇటీవలే అరెస్టయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సూపర్ మచ్చి'!...

చిరు అల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటించిన చిత్రం 'సూపర్ మచ్చి'. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా థియేటర్లకు రాలేకపోయింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని చూస్తోందట చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details