విరించి ఘటనపై కేటీఆర్
విరించి (Virinchi) ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఓ నెటిజన్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును ఆదేశించారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ మంత్రికి.. ఓ వ్యక్తి ట్వీట్(Tweet) చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మిగతా మంత్రులెందుకు..?'
హైదరాబాద్లో ఏ సంఘటనా జరిగినా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తే... మిగిలిన మంత్రులు ఎందుకని తెజస అధ్యక్షుడు కోదండరాం వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ తప్పితే.. మిగతా మంత్రులతో ఏ పని కాదని తేటతెల్లమైందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఇళ్లు నిర్మించండి..!'
మాజీ మంత్రి ఈటల రాజేందర్పై వస్తున్న ఆరోపణలపై వేగంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మియాపూర్ ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ప్రశ్నించారు. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని పేదలకు డబుల్బెడ్ రూం ఇళ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
మరో 3 ట్యాంకర్లు
హైదరాబాద్ కు మరో మూడు క్రయోజనిక్ ఆక్సిజన్ (Oxygen) ట్యాంకర్లు చేరుకున్నాయి. మేఘా (Megha) ఇంజినీరింగ్ కంపెనీ- మెయిల్ సామాజిక బాధ్యత కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఆక్సిజన్ ట్యాంకర్లను ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రానికి ట్యాంకర్లు చేరుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రోగిని మోస్తూ 7 కి.మీలు
ఉత్తరాఖండ్లో రాష్ట్ర విపత్తు స్పందన దళం మానవత్వాన్ని చాటుకుంది. కొండ ప్రాంతంలో కరోనా సోకిన గోపాల్ సింగ్ అనే వృద్ధుడిని ఇంటి నుంచి.. సిబ్బంది అంబులెన్సు వరకు 7 కిలోమీటర్లు కాలినడకన మోసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.