ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు CM KCR Comments on Cloud Burst: సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల వెనుక విదేశాల కుట్ర ఉన్నట్టు తెలుస్తోందని సీఎం కేసీఆర్ తెలిపారు. గతంలోనూ పలు రాష్ట్రాల్లో ఇలా జరిగిందని వివరించిన కేసీఆర్.. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాలపై క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్టు సమాచారం వస్తోందని పేర్కొన్నారు.' మూడు షిఫ్టుల్లో పనిచేయండి'CM KCR Visit: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. మొదట భద్రాచలంలో పర్యటించిన సీఎం.. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఏటూరునాగారంలోని రామన్నగూడెంకు వెళ్లారు. వరద బాధితులను పరామర్శించారు. అనంతరం.. అధికారులు, ప్రజాప్రతినిధులతో వరద ముంపు ప్రాంతాల పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.బోనాల సంబురం.. పోటెత్తిన భక్తులు Lashkar Bonalu: బంగారు బోనాలు.. పోతురాజు విన్యాసాలు.. సాంప్రదాయదుస్తుల్లో ముత్తైదువులు.. ప్రముఖుల సందర్శనలు.. పోటెత్తుతున్న భక్తులతో.. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది. రెండ్రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ' కేసీఆర్ను వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి..'Revanth Reddy Comments: హైదరాబాద్ లక్డీకపూల్లోని ఓ హోటల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మూడున్నర గంటలపాటు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన నేతలు.. సీఎం కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ అంశంపై ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ను కేంద్రం వెంటనే కస్టడీలోకి తీసుకుని విచారణ జరపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు.ఈ శతాబ్దపు జోక్ Bandi Sanjay On CM KCR: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే విదేశీ కుట్ర అంటూ కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ తప్పిదాల వల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ మునిగిందన్నారు. సీఎం చేసిన కామెంట్లు జోకర్ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. 200 కోట్ల మార్కు దాటిన వ్యాక్సినేషన్రోనా టీకా పంపిణీలో భారత్ ఆదివారం(జులై 17) మరో మైలురాయి సాధించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారుఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫు ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా(80) ఎంపికయ్యారు. ఈ మేరకు అల్వాను బరిలోకి దించనున్నట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారురాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధంభారతదేశ 15వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు సర్వం సిద్ధమైంది. పార్లమెంటు సహా వివిధ రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ జరగనుండగా పోలింగ్కు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఈసీ పూర్తి చేసింది. ఉదయం 8గంటలకు..మాక్ పోలింగ్ జరగనుండగా ఆ తర్వాత 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరుగుతుందిసింగపూర్ ఓపెన్ విజేతగా సింధు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్ గెల్చుకుంది. 21-9, 11-21, 21-15 తేడాతో చైనాకు చెందిన వాగ్ యీని ఓడించింది. దీంతో ఈ సీజన్లో తొలి సూపర్ 500 టైటిల్ను దక్కించుకుంది.నిర్మాతల సంచలన నిర్ణయంక్యారెక్టర్ ఆర్టిస్ట్లు, హీరోహీరోయిన్లు పారితోషికాలు పెంచడం.. తమకూ కనీస వేతనాలు పెంచాలంటూ జూనియర్ ఆర్టిస్ట్లు సమ్మెకు దిగడం మొదలైన కారణాల వల్ల భవిష్యత్తులో సినిమాల నిర్మాణంపై నిర్మాతల మండలి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.