తెలంగాణ

telangana

By

Published : Jan 5, 2022, 9:00 PM IST

ETV Bharat / city

Top News: టాప్ న్యూస్​ @ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana  at 9 PM
టాప్ న్యూస్​ @ 9PM

  • బండి సంజయ్ విడుదల

కరీంనగర్ జైలు నుంచి బండి సంజయ్ విడుదలయ్యారు. జైలులో బండి సంజయ్‌ను పరామర్శించేందుకు భగవంత్‌ కుబ వెళ్లారు. ఆయనతో కలిసి బండి సంజయ్​ బయటకు వచ్చారు.

  • జేపీ నడ్డా..కేరాఫ్‌ ఎర్రగడ్డ

భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్​ ఖండించారు. కేసీఆర్‌ పట్ల జేపీ నడ్డా వ్యాఖ్యలు హేయంగా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్‌కు, జేపీ నడ్డాకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు.

  • ఒక్కరోజే 1520 కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మూడు నాలుగు రోజుల ముందు వరకు కేవలం 200 లోపే నమోదైన కొవిడ్​ కేసులు.. రెండు రోజుల నుంచి వెయ్యికిపైగా వెలుగుచూస్తున్నాయి.

  • మోదీ పంజాబ్ టూర్​కు బ్రేక్

Modi Punjab visit: పంజాబ్​లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ అనూహ్యంగా రద్దు అయింది. సభకు ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు. దాంతో 20 నిమిషాలపాటు ఓ ఫ్లైఓవర్​పైనే ఆగిపోయిన ఆయన.. తిరిగి దిల్లీకి బయల్దేరారు.

  • 14 కాదు 7 రోజులే..

Home Isolation Guidelines: దేశంలో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో.. స్వల్పస్థాయి లేదా కొవిడ్ లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్​లో ఉండేందుకు నూతన మార్గదర్శకాలను జారీచేసింది కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ. హోం ఐసోలేషన్ గడువును 14 రోజుల నుంచి 7రోజులకు తగ్గించింది. కొవిడ్ సోకిన వ్యాక్తి ఏడు రోజుల్లో డిశ్ఛార్జ్​ కావొచ్చని తెలిపింది.

  • యథావిధిగా 'సివిల్స్ మెయిన్స్'

Civils main exam date 2021: 2021 సివిల్స్ మెయిన్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని యూపీఎస్​సీ ప్రకటించింది. ఆంక్షల అమలులో ఉన్న రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సహకరించాలని కోరింది.

  • ' వ్యాక్సిన్​ తీసుకున్నాక ఆ పని చేయొద్దు'

Bharat Biotech: దేశంలో 15-18 ఏళ్ల వయస్కులకు కొవాగ్జిన్​ టీకా పంపిణీ జరుగుతున్న నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది వ్యాక్సిన్​ తయారీ సంస్థ భారత్​ బయోటెక్​. టీకా తీసుకున్న తర్వాత.. ఎలాంటి మందులు వాడాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.

  • మూడో రోజూ 60వేల మార్కు దాటిన సెన్సెక్స్

Stock Market Closing: స్టాక్​ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. మొదట నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు.. తర్వాత కొద్దిసేపటికే పుంజుకున్నాయి. సెన్సెక్స్ 367పాయింట్లు వృద్ధి చెంది 60వేల 223 వద్ద స్థిరపడింది. నిప్టీ 120 పాయింట్ల లాభంతో 17వేల 925 వద్దకు చేరింది.

  • ఆర్‌ఆర్‌ఆర్​పై పిల్​

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్రను వక్రీకరించారని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్​ దాఖలు చేశారు

  • సఫారీల లక్ష్యం ఎంతంటే?

IND vs SA Test: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో 266 పరుగులకు ఆలౌటైంది టీమ్ఇండియా. రహానే, పుజారా అర్ధశతకాలతో రాణించగా.. చివర్లో విహారి (40*) అద్భుతంగా పోరాడాడు.

ABOUT THE AUTHOR

...view details