తెలంగాణ

telangana

By

Published : May 28, 2022, 7:00 PM IST

ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS
టాప్ న్యూస్ @ 7PM

  • దిల్లీ పీఠాన్ని వణికించిన ఎన్టీఆర్!

దేశ రాజకీయాల్లో.. దిల్లీ పీఠం మాటే శాసనంగా చెలామణి అయ్యే కాలమది..! సమాఖ్య స్ఫూర్తికి పాతరేసి.. ప్రజాప్రభుత్వాలను కూలదోసే దొడ్డిదారి రాజకీయం రాజ్యమేలుతున్న రోజులవి..!! కేరళలో రాష్ట్ర సర్కారును కూలదోసిన విధంగానే.. తెలుగునాట సైతం గవర్నర్ అస్త్రాన్ని ప్రయోగించింది

  • 'తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.'

Kishan Reddy on KCR: కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారని కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం దివాలా దిశగా సాగుతోందని ఆయన మండిపడ్డారు. ప్రజలు కచ్చితంగా తెరాస పార్టీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని ఆయన అన్నారు.

  • మంటల్లో 100 చెట్లు దగ్ధం

మహబూబాబాద్ జిల్లా జంగిలిగొండ పల్లె ప్రకృతి వనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపుగా వంద చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి

  • కారు డోర్​ తీసిన యజమాని.. ఒకరు బలి

Accident at Narsingi: మృత్యువు ఏ వైపు నుంచి ఎలా దూసుకువస్తుందో ఎవరూ చెప్పలేరు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు.. మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ముందువెనకా ఉన్న వాహనదారులు.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా వారి నిర్లక్ష్యానికి ఇవతలి వాళ్లు బలి కావాల్సిందే. అలాంటి సంఘటనే హైదరాబాద్​ శివారులో చోటుచేసుకుంది. ఓ కారు యజమాని నిర్లక్ష్య డ్రైవింగ్​కు నిండు ప్రాణం బలైంది.

  • సరికొత్త స్టైల్లో పెళ్లి మండపానికి వధువు.. వీడియో వైరల్​!

కాలం మారుతోంది. ప్రతి విషయంలోనూ కొత్తదనం కోరుకుంటోంది యువత. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో వధూవరులు.. విచిత్ర వేషధారణలు, అదిరిపోయే ఎంట్రీలతో ఆకట్టుకోవడం ఇటీవల ఎక్కువైంది. మధ్యప్రదేశ్​లోని బైతూల్​లోనూ అచ్చం ఇలాంటిదే జరిగింది.

  • భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

Chennai man kills wife children: తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా పడి ఉండటం కలకలం రేపింది. ఇంటి యజమాని తన భార్య, పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, రాజస్థాన్​లో నాలుగేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.

  • అత్తింటి వేధింపులు.. బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు

Dead Bodies in a well: ముగ్గురు అక్కాచెల్లెళ్లు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చిన్నారులను సైతం తమతో పాటు తీసుకెళ్లారు. మొత్తం ఐదు శవాలు బావిలో కనిపించాయి. మరోవైపు, పదకొండు రోజుల క్రితం ఆచూకీ కోల్పోయిన ఓ బాలిక.. బావిలో శవమై తేలింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై రేప్ చేసి.. బావిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

  • ఐరోపా దేశాల ఆంక్షలు.. భారత కంపెనీలకు కష్టాలు!

Indian Oil Companies Dividend: రష్యాపై ఐరోపా సహా పలు దేశాల ఆంక్షలతో.. భారత కంపెనీలను కష్టాలు వెంటాడుతున్నాయి. రష్యన్​ కంపెనీల్లో వాటాలున్న కొన్ని భారత చమురు సంస్థలకు రావాల్సిన డివిడెండ్​ ఆగిపోవడమే కారణం.

  • ఏఎన్​ఆర్​ కడుపునిండా అన్నం తినేవారు కాదట!

ANR NTR 100 Years Birth anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర​ రావు. వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు. అయితే ఓ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్​ వచ్చే సరికి ఏఎన్​ఆర్​ స్టార్​ హీరో అయినా... అన్నగారిని చూసి ఏఎన్​ఆర్​ భయపడ్డారట! సరిగ్గా కడుపు నిండా భోజనం కూడా చేసేవారు కాదట. ఆ విశేషాలను తెలుసుకుందాం...

  • 'బట్లర్​ నా రెండో భర్త'.. క్రికెటర్​ భార్య షాకింగ్ కామెంట్స్​!

IPL 2022: ఐపీఎల్​లో రాజస్థాన్​ రాయల్స్​కు ఆడుతున్న సౌతాఫ్రికా క్రికెటర్​​ రాస్సీ వాన్​ డర్​ డసెన్​ భార్య లారా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అదే జట్టుకు చెందిన స్టార్​ ఓపెనర్​ జోస్​ బట్లర్​ తన రెండో భర్త అని చెప్పింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు ఆమె ఎందుకలా చెప్పిందో తెలుసుకుందాం..

ABOUT THE AUTHOR

...view details