తెలంగాణ

telangana

ETV Bharat / city

Toll Fees Hike: ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజులు పెంపు - ap updates

ఏపీలోని జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజులు పెరుగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి.

Toll Fees Hike: ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజులు పెంపు
Toll Fees Hike: ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజులు పెంపు

By

Published : Mar 30, 2022, 8:43 AM IST

జాతీయ రహదారులపై వాహనదారులకు ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ ఫీజుల రూపంలో బాదుడు మొదలు కానుంది. ఏపీలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల్లో ఫీజులు శుక్రవారం నుంచి పెరగనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొత్త రుసుములను ఖరారు చేస్తూ ఆదేశాలు వచ్చాయి. వీటి ప్రకారం కారు, జీపులు వంటి వాహనాలపై 5 నుంచి 10 రూపాయలు, బస్సులు, లారీలకు 15 నుంచి 25 రూపాయలు, భారీ వాహనాలకు 40నుంచి 50 రూపాయల వరకు టోల్‌ రుసుం పెరగనుంది. సింగిల్, డబుల్ ట్రిప్లతో పాటు నెలవారీగా జారీ చేసే పాసుల్లోనూ ఈ పెంపు ఉంటుంది. ఏపీలోని అన్ని జాతీయ రహదారులపై కలిపి 57 టోల్ ప్లాజాలున్నాయి. వీటి మీదుగా వెళ్లే వాహనాల ద్వారా ఏడాదికి 2,409 కోట్ల రూపాయల వరకు వసూలవుతోంది. తాజాగా పెంచుతున్న ఫీజులతో ఇది మరింత పెరగనుంది.

ABOUT THE AUTHOR

...view details