తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్​కు కోదండరాం బహిరంగ లేఖ - Kodandaram letter

Kodandaram: తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్​కు కోదండరాం బహిరంగ లేఖ రాశారు. ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే... వారి కలలను నీరు గారుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.

TJS President Kodandaram open letter to CM KCR
కోదండరాం

By

Published : Jun 6, 2022, 6:37 AM IST

Kodandaram letter to CM KCR: సీఎం కేసీఆర్​ అనుసరిస్తున్న తప్పుడు విధానాలతోనే తెలంగాణలో గత ఎనిమిది ఏళ్లల్లో 4 వేలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. రైతు బంధు పేరిట ప్రభుత్వం అన్నదాతలను మోసం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో చేపట్టిన ఆత్మ గౌరవ దీక్ష సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్​కు కోదండరాం బహిరంగ లేఖ రాశారు.

ఎన్నో ఆశలతో తెలంగాణ ప్రజలు అధికారం అప్పగిస్తే... వారి కలలను నీరు గారుస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. కల్వకుంట్ల కుటుంబం, వారి సన్నిహితులకు 8 ఏళ్లుగా తెలంగాణ వనరులను పరిమితం చేశారని దుయ్యబట్టారు. మిగులు బడ్జెట్‌లో ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కోదండరాం విమర్శించారు.

ఇదీ చదవండి:'ఏం నడ్డాజీ.. మరి బండి సంజయ్​పై చర్యలెప్పుడు?'

ABOUT THE AUTHOR

...view details