తెలంగాణ

telangana

ETV Bharat / city

తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం - Tirupati Lok Sabha by-election counting

తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి విజయం సాధించారు. తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి, భాజపా అభ్యర్థి రత్నప్రభపై గెలుపొందారు.

tirupathi result
తిరుపతిలో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యం

By

Published : May 2, 2021, 11:04 AM IST

Updated : May 2, 2021, 4:03 PM IST

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైకాపా విజయం సాధించింది. బరిలో నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. తాజా సమాచారం మేరకు గురుమూర్తి 2,31,943 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2019లో అధికార వైకాపా అభ్యర్థి సాధించిన 2.28 ఓట్ల మెజారిటీని అధిగమించి వైకాపా విజయతీరాలకు చేరుకుంది. తాజా సమాచారం మేరకు వైకాపాకు 5,37,152 (56.5 శాతం) ఓట్లు పోలయ్యాయి. తెదేపా 3,05,209 (32.1 శాతం), భాజపా 50,739 (5.3 శాతం), కాంగ్రెస్‌ 8,477(0.9 శాతం), సీపీఎం 5,027 (0.5 శాతం), ఇతరులకు 30,704 (3.2 శాతం) ఓట్లు పోలయ్యాయి. మరో 13,300(1.4 శాతం) మంది ఓటర్లు నోటాను ఎంకుకున్నారు.

Last Updated : May 2, 2021, 4:03 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details