తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్​.. తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత - తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత తాజా వార్తలు

నిత్యం వేలాది మంది భక్తులు సందర్శించే తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మూసివేతకు సర్వం సిద్ధమైంది. తిరుమలలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తితిదే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే తొలుత ఘాట్‌ రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేసినట్టు తెలుస్తోంది.

కరోనా ఎఫెక్ట్​.. తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత
కరోనా ఎఫెక్ట్​.. తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత

By

Published : Mar 19, 2020, 3:57 PM IST

Updated : Mar 19, 2020, 4:19 PM IST

తిరుమల ఘాట్‌రోడ్లను తితిదే అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. అలిపిరి గరుడ సర్కిల్‌ నుంచి వచ్చే భక్తులను వెనక్కి పంపేస్తున్నారు. ఎగువ ఘాట్‌ రోడ్డుపైకి వాహనాలు వెళ్లకుండా తితిదే విజిలెన్స్‌ అధికారులు నిలిపివేస్తున్నారు. కొండ పైనుంచి కిందకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలన్నీ కిందకు వచ్చాక దిగువ ఘాట్‌ను మూసేస్తామని అధికారులు తెలిపారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు ప్రకటించారు. అలిపిరి, శ్రీవారిమెట్టు కాలినడక మార్గాలు మూసివేశారు.

కరోనా ఎఫెక్ట్​.. తిరుమల ఘాట్​రోడ్లు మూసివేత
Last Updated : Mar 19, 2020, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details