తెలంగాణ

telangana

ETV Bharat / city

Neelapalli Temple: ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశృతి - కాకినాడ లేటెస్ట్ అప్​డేట్స్

Neelapalli Temple: నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశృతి జరిగింది. ప్రతిష్ఠాపన కోసం తాళ్లతో పైకి ఎత్తగా.. ధ్వజస్తంభం జారిపోయింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.

Neelapalli
Neelapalli

By

Published : Apr 16, 2022, 10:36 AM IST

Neelapalli Temple: ఏపీ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం నీలపల్లిలోని నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించేందుకు.. తాళ్లతో పైకి ఎత్తగా.. ఒక కప్పీ తాడు తెగిపోవడంతో ధ్వజస్తంభం జారిపోయింది. దీంతో ధ్వజస్తంభం నిలిపేవారు. స్థానికులపై పడిపోయారు. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో.. యానాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ధ్వజస్తంభ ప్రతిష్ఠలో అపశృతి

ఇవీ చూడండి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details