సికిద్రాబాద్లో అదుపుతప్పిన కారు.. ముగ్గురికి గాయాలు సికింద్రాబాద్లోని బోయినపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కారు దూసుకొచ్చింది. బాలరాయి నుంచి వస్తున్న క్రమంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి ఒక్కసారిగా డివైడర్పైకి వెళ్లి, డీసీఎంను ఢీకొట్టింది. కారులోని ముగ్గురు వ్యక్తులతోపాటు డీసీఎం డ్రైవర్కు సైతం గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.