తెలంగాణ

telangana

By

Published : Oct 8, 2022, 11:30 AM IST

ETV Bharat / city

తితిదే మహిళా ఉద్యోగులకు క్యాన్సర్​పై అవగాహన సదస్సు..

AWARENESS PROGRAM : తితిదే మహిళా ఉద్యోగులకు క్యాన్సర్​పై 3రోజుల పాటు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమాన్ని సినీనటి గౌతమి ప్రారంభించారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్సర్ రావ‌చ్చని.. స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్పత్తుల వినియోగంతో దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చని గౌతమి అన్నారు.

ttd
తితిదే

తితిదే మహిళా ఉద్యోగులకు క్యాన్సర్​​పై అవగాహన సదస్సు

AWARENESS PROGRAM ON CANCER : ప్రశాంత‌మైన మ‌న‌స్సుతో యోగా, ధ్యానం అల‌వ‌ర‌చుకుని గోఆధారిత వ్యవ‌సాయ ఉత్పత్తుల‌ను ఆహారంగా తీసుకుంటే క్యాన్సర్ ర‌హిత స‌మాజాన్ని నిర్మించ‌వ‌చ్చని ఏపీలోని తితిదే ఈఓ ధ‌ర్మారెడ్డి తెలిపారు. తితిదే మ‌హిళా ఉద్యోగుల‌కు క్యాన్సర్ పై 3 రోజుల పాటు నిర్వహించనున్న అవ‌గాహ‌న కార్యక్రమాన్ని సినీనటి గౌత‌మితో కలిసి ఆయన ప్రారంభించారు. వ‌య‌సుతో నిమిత్తం లేకుండా ఎవ‌రికైనా క్యాన్సర్ రావ‌చ్చని.. స‌రైన ఆహార అల‌వాట్లు, ర‌సాయ‌న ర‌హిత ఉత్పత్తుల వినియోగంతో దీనికి అడ్డుక‌ట్ట వేయ‌వ‌చ్చని గౌతమి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details