తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2021, 7:19 AM IST

ETV Bharat / city

APPSC : గ్రూప్-1 మినహా ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిలిమ్స్ ఉండదు!

ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్‌-1కి మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను తొలగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం ఒకే సిలబస్‌తో రెండు పరీక్షలు జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణా కేంద్రాల్లోనే గడపాల్సి వస్తోంది.

appsc
appsc

ఏపీపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ నియామక రాత పరీక్షల్లో గ్రూప్‌-1 మినహా మిగిలిన వాటికి ప్రిలిమ్స్‌ను తొలగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ఆ మేరకు త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఒకే సిలబస్‌తో రెండు పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నందున అభ్యర్థులు ఎక్కువ సమయాన్ని శిక్షణా కేంద్రాల్లోనే గడపాల్సి వస్తోంది. అలాగే ఫీజుల పేరుతో వేల రూపాయలు చెల్లించలేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అందువల్ల గ్రూప్‌-2, గ్రూప్‌-3, ప్రభుత్వ పాలిటెక్నిక్‌, డిగ్రీ, జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు, కొన్ని ఇంజినీరింగ్ ఉద్యోగాలకు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ అని లేకుండా గతంలో మాదిరిగా ఒకే పరీక్ష నిర్వహించనున్నారు.

ఒకే పరీక్ష పద్ధతిని అనుసరిస్తే అభ్యర్థుల సంఖ్య మేరకు 2, 3 రోజుల పాటు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. దీనివల్ల కొందరికి ప్రశ్నలు సులువుగా మరికొందరికి కఠినంగా వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అభ్యర్థులకు నష్టం జరగకుండా వారి ప్రతిభను గుర్తించేందుకు నార్మలైజేషన్‌ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details