తెలంగాణ

telangana

లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

By

Published : May 20, 2021, 4:20 PM IST

రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. పరిస్థితిని సమీక్షించిన సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు.

The state government issued orders
లాక్ డౌన్ పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

సీఎం కేసీఆర్ ఆదేశాలతో లాక్ డౌన్ ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. రాష్ట్రంలో పరిస్థితిపై సమీక్షించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్‌ డౌన్‌పై ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఇదివరకే ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఈనెల 30 వ తేదీ వరకు పొడిగిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. రోజుకు 20 గంటల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారమే ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని కార్యకలాపాలకు సడలింపులు ఉంటాయి. లాక్ డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు.

ఇదీ చూడండి;రహదారులపైకి వాహనదారులు.. సీజ్ చేస్తున్న పోలీసులు

ABOUT THE AUTHOR

...view details