తెలంగాణ

telangana

ETV Bharat / city

లాక్​డౌన్​ వేళ జీవనాధారం ఎడారిమయం - lockedown time Hyderabad Migrant laborers suffer

లాక్​డౌన్​ సమయంలో వలస కూలీలు పలుచోట్ల చిక్కుకుని అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్​లో ఉన్న మధ్యప్రదేశ్​కు చెందిన సుమారు 40కి పైగా కుటుంబాలు తమకు ఎలాంటి సాయం అందడం లేదని వాపోతున్నారు. స్థానికంగా ఓటరు గుర్తింపు, ఆధార్​ కార్డులు ఉన్నా రేషన్ కార్డులు లేవని ప్రభుత్వం అందించే బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

the-lifeblood-of-the-desert-in-lockdown-time in hyderabad
లాక్​డౌన్​ వేళ జీవనాధారం ఎడారి మయం

By

Published : Apr 17, 2020, 11:41 AM IST

హైదరాబాద్​ నగరంలో మధ్యప్రదేశ్​కు చెందిన వారు గత 20 ఏళ్ల నుంచి వివిధ కార్యక్రమాలకు వీధుల్లో ఒంటెలను తిప్పుతూ జీవనం సాగించేవారు. లాక్​డౌన్​ వేళ 40కి పైగా కుటుంబాలకు ఆకలి తిప్పలు తప్పడం లేదు. తమకు స్థానికంగా ఓటరు గుర్తింపు, ఆధార్​ కార్డులు ఉన్నా రేషన్ కార్డులు లేవని ప్రభుత్వం అందించే బియ్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతవరకు తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదన్నారు. తమను అదుకోవాలని కోరుతున్నారు. తమ వెంట ఉన్న ఒంటెల ఆహారం కోసం బయట ప్రాంతాల్లో ఆకుల సేకరణ కూడా కష్టతరంగా మారిందని చెబుతున్నారు.

లాక్​డౌన్​ వేళ జీవనాధారం ఎడారి మయం
లాక్​డౌన్​ వేళ జీవనాధారం ఎడారి మయం

ఇదీ చూడండి :మీరు నీలిచిత్రాలు చూస్తున్నారా... జాగ్రత్త

ABOUT THE AUTHOR

...view details