తెలంగాణ

telangana

ETV Bharat / city

సింగరేణిలో దసరా ముందే వచ్చేసింది: మంత్రులు కొప్పుల, ఇంద్రకరణ్ రెడ్డి - SINGARENI

సింగరేణి కార్మికులకు బోనస్​ ఇవ్వటం పట్ల ముఖ్యమంత్రికి మంత్రి కొప్పుల ఈశ్వర్​ కృతజ్ఞతలు తెలిపారు. గనుల చరిత్రలోనే ఒక్కో కార్మికునికి ఒక లక్షా 899రూపాయలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్‌ అని కొనియాడారు.

దసరా పండుగ ఇవ్వాలనే వచ్చినట్లుగా ఉంది: మంత్రి కొప్పుల

By

Published : Sep 19, 2019, 4:56 PM IST

దసరా పండుగ ఇవ్వాలనే వచ్చినట్లుగా ఉంది: మంత్రి కొప్పుల
సింగరేణి లాభాలను కార్మికులకు పంచాలని సభలో సీఎం కేసీఆర్ ప్రకటించినందున కార్మికులు, స్థానిక ఎమ్మెల్యేల తరఫున మంత్రి కొప్పుల ఈశ్వర్ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్కో కార్మికునికి ఒక లక్షా 899రూపాయలు ఇస్తున్న నాయకుడు కేసీఆర్‌ మాత్రమేనని కొనియాడారు. ఈ లాభాలను దసరా పండగ రోజున ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే గనులలో పండగ వాతావరణం నెలకొందని మంత్రి పేర్కొన్నారు. దసరా పండగ ఇవ్వాళే వచ్చినట్లుందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంతోషం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థలో లాభాలు గతంకంటే ఎక్కువ వచ్చాయని, వాటికనుగుణంగా లాభాల వాటాను 28శాతం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ సభలో వెల్లడించారని చెప్పారు. మరోమంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి కూడా సీఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి చరిత్రలో కేసీఆర్​ నూతన అధ్యాయం లిఖించారని కొనియాడారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details