తెలంగాణ

telangana

By

Published : Jul 22, 2021, 7:23 AM IST

ETV Bharat / city

CBSE: అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించలేం!

ప్రైవేటు విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని సీబీఎస్​ఈ బోర్డు బుధవారం వెల్లడించింది. ఆ విద్యార్థులకు అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది.

సీబీఎస్​ఈ
CBSE

ప్రైవేటు విద్యార్థులకు సీబీఎస్​ 10, 12వ తరగతి పరీక్షలు ఆగస్టు 16న ప్రారంభం కానున్నట్లు బోర్డు బుధవారం వెల్లడించింది. సెప్టెంబరు 15 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని తెలిపింది. రెగ్యులర్​ విద్యార్థులకు అమలు చేసినట్టు.. అసెస్మెంట్​ల ఆధారంగా ఫలితాలను నిర్ణయించే అవకాశం లేదని స్పష్టం చేసింది. ఈ విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి అసెస్మెంట్​ రికార్డులు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొంది.

సీబీఎస్​ఈ నిర్ణయంపై ప్రైవేటు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. బోర్డు కార్యాలయం ఎదుట బుధవారం పలువురు విద్యార్థులు నిరసన తెలిపారు. సీబీఎస్​ఈ బోర్డు పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ఇదీ చూడండి:Pegasus: ఈ సంకేతాలుంటే.. మీ ఫోన్‌ హ్యాక్‌ అయినట్లే!

ABOUT THE AUTHOR

...view details