తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2021, 2:48 PM IST

ETV Bharat / city

TG COMMENTS: సీఎం కేసీఆర్​ది రోజుకో మాట: టీజీ

ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నారని.. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం జలవివాదం తెరపైకి తీసుకొచ్చారని ఏపీకి చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ ఆరోపించారు. కేసీఆర్ ఆమోదంతోనే 2015 ఒప్పందంపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేశాయన్న టీజీ.. ఆ ఒప్పందం కాదంటే తాము రాష్ట్రవిభజన ఒప్పుకోమని స్పష్టం చేశారు.

TG COMMENTS. tg on cm kcr
సీఎం కేసీఆర్​పై టీజీ వ్యాఖ్యలు, ఏపీ ఎంపీ టీజీ వెంకటేశ్

సీఎం కేసీఆర్​పై టీజీ వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​పై ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్ మండిపడ్డారు. కృష్ణా జలాలపై కేసీఆర్, ఆయన మంత్రులు​ రోజుకోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. కేవలం హుజూరాబాద్ ఉపఎన్నికల కోసం జలవివాదం తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ విద్యుత్‌ ఉత్పత్తి కోసమే అంటున్న తెలంగాణ నాయకులు.. మరి ఇన్ని రోజులు సాగునీటి కోసం ఎందుకు వాడుకున్నారని నిలదీశారు. కేసీఆర్ ఆమోదంతోనే రెండు రాష్ట్రాల మధ్యం 2015లో ఒప్పందం జరిగిందని ఆయన గుర్తుచేశారు. ఆ అగ్రిమెంట్ కాదంటే మేం తిరిగి సమైక్యాంధ్ర ఉండాలని కోరుతామన్నారు.

ఏపీకి చెందిన జలాల విషయంలో నాయకులంతా ఒకే తాటిపై నడవాలని హితవు పలికారు. రాయలసీమ జలాలపై రెండు, మూడు రోజుల్లో సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

తెలంగాణలో హుజూరాబాద్​ బై ఎలక్షన్లు ఉన్నాయి. మాకు నీళ్లు రాకుండా చేసి ఎన్నికల్లో కేసీఆర్​ గెలవాలనుకుంటున్నట్టున్నారు. చంద్రశేఖర్​రావు​ మేధావి. ఆయన తీపి కబుర్లు చెబుతాడు. చేదు కబుర్లు చెబుతాడు. ఆయనకు ఈ మధ్య మతిమరుపు వచ్చింది. కృష్ణా నీటి వినియోగంలో 2015లో కేంద్ర ప్రభుత్వ ఒప్పందానికి కేసీఆర్​ సంతకాలు పెట్టి మర్చిపోతున్నారు. నీటి ఒప్పందానికి విలువ ఇవ్వనంటే.. రాష్ట్ర విభజన సమయంలో చేసుకున్న ఒప్పందాలకు కూడా విలువ ఇవ్వకూడదు. లేదు నేను విద్యుత్​ వాడుకుంటాను అంటే సమైక్యాంధ్రలోనే ఉండిపో.-టీజీ వెంకటేశ్, ఏపీ ఎంపీ

ఇదీ చదవండి:న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details