రాష్ట్రంలో లాక్డౌన్ ఆంక్షలు పదో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.
పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు - telangana lockdown
రాష్ట్రంలో పదిరోజులుగా లాక్డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు రావడం వల్ల ఉదయం 10 గంటల వరకు రహదారులన్ని కిటకిటలాడాయి. పలుచోట్ల కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.
![పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు lockdown, telangana lockdown, telangana lockdown 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11840016-1101-11840016-1621572451488.jpg)
లాక్డౌన్, తెలంగాణ లాక్డౌన్, తెలంగాణ లాక్డౌన్ 2021
ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను జప్తు చేశారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.
- ఇదీ చదవండి :కరోనా మృత్యుఘోష.. మళ్లీ 4వేల పైకి మరణాలు