తెలంగాణ

telangana

పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు

By

Published : May 21, 2021, 10:27 AM IST

రాష్ట్రంలో పదిరోజులుగా లాక్​డౌన్ కొనసాగుతోంది. నిత్యావసర సరకులు కొనుగోలు చేసేందుకు ప్రజలు బయటకు రావడం వల్ల ఉదయం 10 గంటల వరకు రహదారులన్ని కిటకిటలాడాయి. పలుచోట్ల కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిని పోలీసులు హెచ్చరించారు.

lockdown, telangana lockdown, telangana lockdown 2021
లాక్​డౌన్, తెలంగాణ లాక్​డౌన్, తెలంగాణ లాక్​డౌన్ 2021

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు పదో రోజు పకడ్బందీగా అమలవుతున్నాయి. ప్రజలు ఉదయం వేళ నిత్యావసర వస్తువులు కొనేందుకు పెద్ద సంఖ్యలో బయటకు వచ్చారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉన్నందున మార్కెట్లకు పోటెత్తారు. పలు చోట్ల ప్రజలు కొవిడ్‌ నిబంధనలు మరిచి... భౌతిక దూరం పాటించకుండానే కొనుగోళ్లు సాగించారు.

ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రహదారిపైకి వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను జప్తు చేశారు. అత్యవసర పరిస్థితిల్లో మాత్రమే ప్రజలు బయటకు రావాలని సూచించారు. ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ మహమ్మారి కట్టడికి కృషి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details