తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎస్సై దురుసు ప్రవర్తన.. కారంపొడి చల్లిన మహిళలు - కర్నూలు క్రైమ్ న్యూస్

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాలిక అదృశ్యమైన కేసులో ఎస్సైపై మహిళలు దాడికి పాల్పడ్డారు. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. రాత్రి జొన్నగిరి పోలీస్ స్టేషన్​కు బాలికను తీసుకువచ్చారు.

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత
ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత

By

Published : May 25, 2021, 2:14 PM IST

Updated : May 25, 2021, 2:30 PM IST

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పగిడిరాయికి చెందిన బాలిక అదృశ్యమైంది. ఈ కేసును ఛేదించిన పోలీసులు.. రాత్రి జొన్నగిరి పోలీస్ స్టేషన్​కు బాలికను తీసుకువచ్చారు. బాలికను చూపించాలని పెద్దఎత్తున పోలీస్ స్టేషన్​కు బంధువులు వెళ్లారు.

ఎస్సై సురేశ్ తమతో దురుసుగా ప్రవర్తించినట్లు బంధువులు చెబుతున్నారు. అయితే అనంతరం పగిడిరాయికి వెళ్లిన ఎస్సైపై మహిళలు కారంపొడి చల్లారు. ఈ ఘటనతో అర్ధరాత్రి గ్రామంలో ఘర్షణ చోటు చేసుకుంది. పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. డోన్ డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు మోహరించారు.

ఏపీలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో ఉద్రిక్తత

ఇదీ చదవండి:ప్రజలు మరింత సహకరిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయి: సీపీ

Last Updated : May 25, 2021, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details