తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2021, 1:00 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @ 1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten news today till now
టాప్​టెన్ న్యూస్ @ 1PM

  • హైస్కూల్​లో మంటలు..

హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీనివాస హైస్కూల్ ఆఫీస్​లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమయింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రుణయాప్​లు బ్లాక్..

రుణ యాప్‌ల నిర్వాహకుల ఆటలు కట్టించేలా హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. లోన్‌ యాప్‌లు బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. యాప్‌ల తొలగింపునకు ప్లేస్టోర్లను సంప్రదించాలని డీజీపీకి హైకోర్టు నిర్దేశం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఇదే మార్చుకోవాలి..

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండో రోజు చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును విపక్షాలు తప్పుపట్టాయి. రైతులపై గెలిచేందుకు కందకాలు తవ్వటం, ముళ్ల తీగలు వేయటం వంటివి ఏర్పాటు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి భావనను మార్చుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • చౌరీ చౌరా శతాబ్ది వేడుకలు..

ఉత్తర్​ప్రదేశ్​ గోరఖ్​పుర్​లో చౌరీ చౌరా శతాబ్ది ఉత్సవాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆ వాహనాలిక తుక్కుకే!

కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేలా పాలసీని తీసుకొస్తామన్న కేంద్ర ప్రకటనపై రాష్ట్ర రవాణా శాఖ దృష్టి సారించింది. కాలుష్య నియంత్రణకు 15, 20 ఏళ్లు దాటిన వాహనాలను తుక్కుగా మార్చాలని పేర్కొనటంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ కోవలోకి వచ్చే వాహనాలెన్ని అని లెక్కలు సేకరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఆధార్ ఉంటేనే పెళ్లి..

బాల్య వివాహాలను అరికట్టేందుకు ఒడిశా ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. కనీస వివాహ వయసు లేకుండా జరుగుతున్న పెళ్లిళ్లకు అడ్డుకట్ట వేసేలా.. ఆధార్​ కార్డును తప్పనిసరి చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • క్యాన్సర్‌ నివారణ ఎలా?

క్యాన్సర్‌ నివారణ మన బాధ్యతే. ఇప్పుడంతా ఇలాంటి సంకల్పమే తీసుకోవాలి. ప్రపంచ క్యాన్సర్‌ దినం సందేశం ఇదే. క్యాన్సర్‌ బారినపడకుండా చూసుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది మరి. ఆహార విహారాల్లో జాగ్రత్త వహిస్తే క్యాన్సర్‌ దరిజేరకుండా కాపాడుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మయన్మార్​లో ఫేస్​బుక్ బంద్

మయన్మార్​లో సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వైద్యులు శాసనోల్లంఘన ఉద్యమం చేపట్టారు. సైన్యం అధీనంలో పనిచేసేది లేదని స్పష్టం చేశారు. ఛారిటీ వైద్య కేంద్రాల్లో సేవలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు, నిరసనలు పుంజుకుంటున్న వేళ మయన్మార్​లో ఫేస్​బుక్ సేవలను నిలిపివేసింది సైన్యం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • హజారే ట్రోఫీ తమిళ జట్టులో నట్టూ

విజయ్​ హజారే ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమిళనాడు క్రికెట్​ అసోసియేషన్​ జట్టును ప్రకటించింది. అందులో యువ పేసర్​ తంగరసు నటరాజన్​కూ చోటు కల్పించింది. కానీ తుది టీమ్​లో ఆడించే విషయంపై మాత్రం బీసీసీఐ అనుమతి కోరినట్లు టీఎన్​సీఏ స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • విడాకులు కాదు.. బ్రేకప్

'కొత్త బంగారు లోకం' నటి శ్వేతా బసు ప్రసాద్​ 2018లో పెళ్లి చేసుకుంది. తర్వాత ఏడాదే అనుకోని కారణాల వల్ల విడాకులు తీసుకుంది. కాగా తాజాగా ఈ విషయంపై స్పందించింది శ్వేత. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

...view details