తెలంగాణ

telangana

By

Published : Aug 26, 2022, 6:58 PM IST

ETV Bharat / city

Telangana Top news టాప్ న్యూస్ 7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS

  • భాజపా సభకు హైకోర్టు అనుమతి, ఆ హామీ ఇవ్వాలని కండీషన్

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు భాజపా నేతలు ఉన్నత న్యాయస్థానంలో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు.

  • అలా చేస్తే న్యాయాన్ని అపహాస్యం చేసినట్లే అవుతుందన్న కేటీఆర్

దేశ జనాభాలో దక్షిణాది రాష్ట్రాల వాటా తగ్గిందన్న గణాంకాల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు. జనాభా నియంత్రణ సహా చాలా అంశాల్లో దక్షిణాది రాష్ట్రాల పనితీరు బేషుగ్గా ఉందని పేర్కొన్నారు.

  • లోన్​ యాప్​ వేధింపులకు మహిళ బలి

లోన్​ యాప్​ వేధింపులు ఇప్పటికీ తగ్గటం లేదు. వారి వేధింపులకు ప్రాణాలు బలికావటం ఆగట్లేదు. రుణ యాప్ నిర్వాహకుల బెదిరింపులు తట్టుకోలేక ఓ మహిళ నిండు ప్రాణం తీసుకుంది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.

  • బండి సంజయ్‌ పాదయాత్రపై ప్రభుత్వం అప్పీల్‌, విచారణ వాయిదా

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రను ఆపేయాలంటూ ప్రభుత్వం హైకోర్టులో వేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

  • ఆ విషయంలో బాధగా ఉందన్న జస్టిస్ రమణ

అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు.

  • మన ప్లాన్​ ఇది కాదు కదా, ఆజాద్​ రాజీనామాపై జీ23 నేతల రియాక్షన్

కాంగ్రెస్​ పార్టీకి గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు జీ23 నేతలైన ఆనంద్ శర్మ, సందీప్ దీక్షిత్. ఆయన ఇలా చేస్తారని ఊహించలేదని అన్నారు. ఆజాద్ రాజీనామాను వెన్నుపోటుగా అభివర్ణించారు దీక్షిత్.

  • కొత్త పార్టీ ఏర్పాటు దిశగా గులాం నబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన వేరే పార్టీలో చేరేది లేదని ఆయన సన్నిహితుడు ఒకరు మీడియాకు తెలిపారు.

  • మళ్లీ మోదీనే నంబర్​ వన్​, ప్రపంచ అత్యుత్తమ నేతల్లో టాప్

భారత ప్రధాని నరేంద్ర మోదీని 75 శాతం మంది ప్రజలు ఆమోదిస్తున్నారని అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సర్వే సంస్ధ వెల్లడించింది. ప్రపంచ నాయకులకంటే అధిక ప్రజామోదం ఉన్న నేతగా మోదీనే ముందున్నారని స్పష్టం చేసింది.

  • ఏజ్​ 40ప్లస్ అయినా తగ్గేదేలే, పారిస్​ ఒలింపిక్స్​పై శరత్​ కమల్ గురి

బర్మింగ్​హామ్​ కామన్​వెల్త్​ గేమ్స్​లో మూడు గోల్డ్​, ఒక సిల్వర్​ మెడల్​ సాధించిన టీటీ ప్లేయర్ ఆచంట శరత్​ కమల్​ ఈటీవీ భారత్​తో ముచ్చటించాడు. కామన్​వెల్త్​ గేమ్స్​లో తన ప్రదర్శన సహా భవిష్యత్ ప్రణాళికల గురించి చెప్పాడు.

  • వేసవి కానుకగా దసరా రిలీజ్,​ తరుణ్​ భాస్కర్ కొత్త సినిమా షురూ

నేచురల్​ స్టార్​ నాని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం దసరా. వేసవి కానుకగా వచ్చే ఏడాది మార్చి 30న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కిస్తున్న కీడా కోలా చిత్రాన్ని రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details